Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవలో ప్రభాస్ - సెల్ఫీల కోసం ఎగబడిన భక్తులు

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (09:26 IST)
టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరో ప్రభాస్ మంగళవారం ఉదయం శ్రీవారి సేవలో పాల్లొన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం "ఆదిపురుష్" చిత్ర తెలుగు వెర్షన్ ఆడియో రిలీజ్ వేడుక మంగళవారం సాయంత్రం తిరుపతి వేదికగా జరుగనుంది. ఇందుకోసం ఆయన తిరుపతికి వచ్చారు. ముందుగా తిరుమలకు చేరుకున్న ఆయన.. తెల్లవారుజామున శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ప్రభాస్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. 
 
సుప్రభాత సేవలో పాల్గొని స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనను ఆశీర్వదించారు. ప్రభాస్‌ను ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అదేసమయంలో తమ అభిమాన నటుడు తిరుమలలో కనిపించడంతో ఆయన అభిమానులతో పాటు సాధారణ భక్తులు కూడా సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు.
 
కాగా, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురిడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఈ నెల 16వ తేదీన పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో విడుదల కార్యక్రమం తిరుపతిలో శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments