Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఫోటోకు జండూబామ్ పెట్టి ట్రోల్స్ చేశారు : దిల్ రాజు కౌంటర్

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (09:51 IST)
ప్రభాస్ హీరోగా ఓ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "ఆదిపురుష్". ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్‌ను చూసిన అనేక మంది ట్రోల్స్ మొదలుపెట్టారు. వీటిపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. ప్రతి సినిమాకు మొదటి రోజు నెగెటెవ్ వైబ్స్ సాధారణమన్నారు. కొంతమంది ఎపుడూ నెగెటివ్‌గా ఉంటారన్నారు. 
 
"ఆదిపురుష్" టీజర్ ఎపుడు వస్తుందా అని ప్రభాస్ అభిమానులే కాదు.. నేను కూడా ఆసక్తిగా ఎదురు చూశాను. టీజర్ రాగానే నేను మొదట ఫోనులో చూశా. వెంటనే ప్రభాస్‌కు ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వచ్చింది. దీంతో అమేజింగ్ అని వాయిస్ మెసేజ్ పెట్టాను. బయట నుంచి ఇంటికి వెళ్లేలోపు టీజర్ రెస్పాన్స్ కనుక్కొందామని నలుగురైదుగురికి ఫోన్ చేస్తే ట్రోలింగ్ చేస్తున్నారు సర్ అని చెప్పారు. 
 
"బాహుబలి-1" మొదటిసారి చూసి బయటకు వచ్చినపుడు అందరూ ట్రోలింగ్ చేశారు. శివలింగాన్ని ఎత్తుకుని ప్రభాస్ వచ్చే ఫోటోకు జండూబామ్ పెట్టి పోస్టులు చేశారు. సినిమా సూపర్ హిట్ అని ప్రభాస్‌కు అపుడే చెప్పా. ఇలాంటి సినిమాలు థియేటర్‌లోనే చూడాలి. సెల్‌ఫోనులో చూసి సినిమాను అంచనా వేయలేం. వీఎఫ్ఎక్స్ సినిమాలను థియేటల్‌లో పూర్తి జనాలతో చూస్తే అర్థమవుతుంది. "ఆదిపరుష్" కూడా అలాంటి సినిమానే. ఇపుడు 3డీలో విజువల్స్ చూస్తే చాలా బాగుంది" అని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నవ్యాంధ్రలోని మూడు పట్టణాల్లో లులు మాల్స్

బంధించడానికి వెళ్లిన వారిపై దాడి చేసిన పులి.. చంపేసిన అధికారులు..

Lulu Malls: తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలలో లులు మాల్స్ ఏర్పాటు

Teenage NRI: 14 ఏళ్ల ఎన్నారై విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల.. ఏడు సెకన్లలోపు గుండె జబ్బుల్ని గుర్తించే..? (video)

Araku Coffee Stall: పార్లమెంటు ఆవరణలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments