Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగులో ఇంకా సినిమా చచ్చిపోలేదంటే అదే కారణం : దర్శకుడు తేజ సెస్సేషనల్‌ తీర్పు

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2023 (19:37 IST)
Director Teja
దర్శకుడు తేజ తాజాగా సోషల్‌ మీడియాలో హీరో గోపీచంద్‌ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. గోపీచంద్‌ సినిమా రామబాణం వచ్చేనెల 5న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు తేజ వినూత్నమైన ఇంటర్వ్యూ ఇచ్చాడు. తేజ కూడా డి.సురేష్‌ బాబు కొడుకు అభిరామ్‌తో అహింస అనే సినిమా చేశాడు. అది విడుదలకు త్వరలో నోచుకోనుంది.
 
ఇక గోపీచంద్‌కు తేజ చెప్పిన సమాధానం ఇదే. సినిమాను ఓటీటీ, సింగిల్‌ స్క్రీన్‌ చంపలేదు. కేవలం మల్టీప్లెక్స్‌ చంపేస్తుంది. అందులోనూ పాప్‌కార్న్‌ చంపేస్తుంది. అంటూ వివరించారు. నేను బాలీవుడ్‌ నుంచి అన్ని వుడ్‌లకు వెళ్ళీ అక్కడ కామన్‌ మేన్‌ నుంచి వివరాలు సేకరించాను. మిగిల్‌క్లాస్‌ సినిమాకు వెళితే బైక్‌ పార్కింగ్‌, ఆ తర్వాత పాప్‌కార్న్‌ కానీ సమోసా, కూల్‌ డ్రింక్ కానీ తాగుతూ సినిమా చూడాలనుకుంటే ఈ రేట్లు ఆడియన్‌ను భయపెట్టిస్తుంది. సినిమా టికెట్‌ కంటే ఈ రేట్లు ఎక్కువ. 
 
ముంబైలో సినిమా చచ్చిపోవడానికి కారణం మల్టీప్లెక్స్‌ థియేటర్లే. తెలుగులో ఇంకా సినిమా చచ్చిపోకుండా బతికి వుందంటే సింగిల్‌ స్క్రీన్‌ వుండడం వల్లనే. మల్టీప్లెక్స్‌ తెర అంటే మన ఇంటిలో టీవీకంటే కొంచెం ఎక్కువ వుంటుంది. అంతే తేడా. నా తీర్పు ఏమిటంటే ఓటీటీలు, టీవీలు సినిమాను చంపలేదు. కేవలం పాప్‌కార్న్‌ చంపేస్తుంది అని ముగించారు. 

సంబంధిత వార్తలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments