Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ది కాశ్మీర్ ఫైల్స్" చిత్ర దర్శకుడుకి వై కేటగిరీ భద్రత

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (15:48 IST)
కశ్మీర్ పండిట్ల ఊచకోత కథాంశంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రం "ది కశ్మీర్ ఫైల్స్". ఈ చిత్ర దర్శకుడు వివేక్ అగ్రిహోత్రికి బెదిరింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆయనకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రతను కల్పించింది. 
 
ఎలాంటి అంచనాలు లేకుండా ఇటీవల విడుదలైంది. కేవలం రూ.3 నుంచి రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించారు. కానీ, శుక్రవారానికి ఏకంగా రూ.100 కోట్ల మేరకు వసూలు చేసినట్టు బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం. 
 
ఆ రోజుల్లో కశ్మీర్ పండిట్లు అనుభవించిన బాధలు, చూసిన నరకం, కశ్మీర్ పండిట్ల ఊచకోత తదితర అంశాలను దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమా చూసిన బయటకు వచ్చిన ప్రతి ఒక్కరి కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. 
 
అనేక వాస్తవ సంఘటనతో ఈ చిత్రాన్ని దర్శకుడు అగ్నిహోత్రి అద్భుతంగా తెరకెక్కించారని పలువురు అభినందలు తెలుపుతుంటే, మరికొందరు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. చంపుతామంటూ బెదిరిస్తున్నారు. 
 
దీంతో కేంద్ర ప్రభుత్వం ఆయనకు వై కేటగిరీ భద్రతను కల్పించింది. అంటే ఆయన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా సీఆర్పీఎఫ్ బలగాలు రక్షణగా ఉంటాయి. కాగా, బాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఈ తరహా భద్రతను నటి కంగనా రనౌత్‌కు ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments