Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ది కాశ్మీర్ ఫైల్స్" చిత్ర దర్శకుడుకి వై కేటగిరీ భద్రత

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (15:48 IST)
కశ్మీర్ పండిట్ల ఊచకోత కథాంశంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రం "ది కశ్మీర్ ఫైల్స్". ఈ చిత్ర దర్శకుడు వివేక్ అగ్రిహోత్రికి బెదిరింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆయనకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రతను కల్పించింది. 
 
ఎలాంటి అంచనాలు లేకుండా ఇటీవల విడుదలైంది. కేవలం రూ.3 నుంచి రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించారు. కానీ, శుక్రవారానికి ఏకంగా రూ.100 కోట్ల మేరకు వసూలు చేసినట్టు బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం. 
 
ఆ రోజుల్లో కశ్మీర్ పండిట్లు అనుభవించిన బాధలు, చూసిన నరకం, కశ్మీర్ పండిట్ల ఊచకోత తదితర అంశాలను దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమా చూసిన బయటకు వచ్చిన ప్రతి ఒక్కరి కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. 
 
అనేక వాస్తవ సంఘటనతో ఈ చిత్రాన్ని దర్శకుడు అగ్నిహోత్రి అద్భుతంగా తెరకెక్కించారని పలువురు అభినందలు తెలుపుతుంటే, మరికొందరు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. చంపుతామంటూ బెదిరిస్తున్నారు. 
 
దీంతో కేంద్ర ప్రభుత్వం ఆయనకు వై కేటగిరీ భద్రతను కల్పించింది. అంటే ఆయన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా సీఆర్పీఎఫ్ బలగాలు రక్షణగా ఉంటాయి. కాగా, బాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఈ తరహా భద్రతను నటి కంగనా రనౌత్‌కు ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments