Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరపై వర్మ జీవితం.. మూడు భాగాలుగా రానున్న మూవీ.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (11:24 IST)
Ramu
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిజజీవితాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు భాగాల్లో తెరకెక్కించేందుకు బొమ్మాకు క్రియేషన్స్ సిద్ధం అయింది. పూర్తి స్థాయిలో తెరకెక్కించేందుకు మూడు భాగాలుగా తెరకెక్కించనున్నారు. అయితే పార్ట్ 1 సినిమా కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఆగస్ట్ 26న సాయంత్రం 5 గంటలకు విడుదల చేసింది చిత్ర యూనిట్. 
 
మూడు భాగాల్లో ఒక్కొక్క చిత్రం యొక్క నిడివి 2 గంటలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. బొమ్మాకు మురళి నిర్మాణంలో ఆర్జీవీ ఆధ్వర్యంలో దొరసాయి తేజ దర్శకత్వంలో సెప్టెంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. 
 
అయితే మొదటి భాగంలో 20 ఏళ్ల ఆర్జీవీ పాత్రలో ఒక యువ నటుడు నటించబోతున్నాడు, రాము టైటిల్‌తో రామ్ గోపాల్ వర్మ ఆరంభం అంటూ ఉండనుంది. 
 
ఈ భాగంలో విజయవాడలో కాలేజ్ రోజులు, ఆయన ప్రేమలు, ఆర్జీవీ పాల్గొన్న గ్యాంగ్ ఫైట్స్, శివ సినిమా కోసం ఏం చేశాడు, రిలేషన్ షిప్స్‌ను ఎలా వాడుకున్నాడు అనే అంశాలు చూపించనున్నారు. రెండవ పార్ట్‌లో వేరే నటుడు నటించనున్నారు, రామ్ గోపాల్ వర్మ అండర్ వరల్డ్‌తో ప్రేమాయణం, ముంబై జీవితంలో అమ్మాయిలు, గ్యాంగ్ స్టర్స్, అమితాబ్‌తో ఉన్న అనుబంధాలను తెరకెక్కించనున్నారు.
 
అయితే పార్ట్-3 లో ఆర్జీవీనే స్వయంగా నటించబోతున్నారు. ఆర్జీవీ ది ఇంటెలిజెంట్ ఇడియట్‌తో మూడో పార్ట్ రానుంది. ఆర్జీవీ ఫెయిల్యూర్స్, వివాదాలు, దేవుళ్ళపై, సెక్స్‌పై, సమాజంపై ఉన్న అభిప్రాయాలతో పాటుగా, చాలామందిపై ఉన్న ఆర్జీవీ ప్రభావం గురించి చూపించనున్నారు. ఈ మూడు భాగాల్లో వివిధ వయసులో జరిగిన వేర్వేరు అంశాలపై ఈ ఆర్జీవీ ఉండనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

జగన్నాథుడి రథానికి సుఖోయ్ విమాన టైర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం