Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడవి దొంగ సినిమా చూపించి పేషెంట్‌ను వైద్యం చేసిన వైద్యులు

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2022 (16:34 IST)
Doctors of Gandhi Hospital
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు రెండు రోజుల క్రితం ఓ మహిళకు సినిమా చూపిస్తూ ఆమెను స్పృహలోనే ఉంచి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేశారు. ఆమె మెదడులోని కణుతులను తొలగించారు. ఆపరేషన్ జరుగుతున్నంత సేపు ఆమె చిరంజీవి నటించిన ‘అడవి దొంగ’ సినిమా చూశారు. ఆపరేషన్ చేస్తున్న వైద్యులు మధ్యమధ్యలో ఆమెతో మాటలు కలుపుతూ విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు.
 
వైద్య ప‌రిభాష‌లో ఈ ప్ర‌క్రియ‌ను అవేక్ క్రేవియోటోమీ అంటార‌ని ఆసుప‌త్రి సూపరింటెండెంట్ రాజారావు, న్యూరో స‌ర్జ‌న్ ప్ర‌కాశ‌రావు, అన‌స్తీషియా వైద్యురాలు శ్రీ‌దేవి తెలిపారు. యాదాద్రి జిల్లాకు చెందిన 60 ఏళ్ళ మ‌హిళ అనారోగంతో ఆసుప‌త్రిలో జాయిన్ అయింది. న్యూరాల‌జీ వైద్యులు ప‌రీక్షించి మెద‌డులో క‌ణితి వుంద‌ని ధృవీక‌రించారు. అనంత‌రం ఆమెకు ఆప‌రేష‌న్ చేయాల‌ని సూచించారు. ఇందుకు త‌గిన విధంగా ఏర్పాటుచేసి మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా ఆమెకు అడ‌విదొంగ సినిమా చూపించి చికిత్స చేశారు. ఈ విష‌యాన్ని ఆసుప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments