Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్‌ను అరెస్టు చేస్తే ప్రభుత్వం ఆస్తుల ధ్వంసానికి కుట్ర : కాంగ్రెస్ (Video)

ఠాగూర్
శుక్రవారం, 20 డిశెంబరు 2024 (14:05 IST)
ఫార్ములా ఈ-కార్ రేస్‌ నిర్వహణ కోసం నిధుల మళ్లింపు కేసులో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్టు చేస్తే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి ఆ పార్టీ నేతలు కుట్ర పన్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ-కార్ రేస్ నిధుల మళ్లింపు అంశంలో మాజీ మంత్రి కేటీఆర్ వద్ద విచారణకు గవర్నర్ కూడా అనుమతి ఇచ్చారు. దీంతో ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్‌ను అరెస్టు చేస్తే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని భారాస నేతలు కుట్ర పన్నారని ఆరోపించారు. 
 
కేటీఆర్‌ను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అరెస్టు చేస్తే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని కేటీఆర్ అనుచరుడు శ్రీధర్ ఆదేశాలిచ్చినట్లు మాకు సమాచారం ఉందన్నారు. ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు తగలబట్టి అల్లర్లు, దాడులు, ధర్నాలు చేసేందుకు సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.2 కోట్ల చొప్పున ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు డబ్బును కూడా చేరవేశారని ఆరోపించారు. అందువల్ల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అదేసమయంలో బీఆర్ఎస్ నేతలపై పోలీసులు ఓ కన్నేసి ఉంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh Meets PM: ఢిల్లీలో ప్రధానిని కలిసిన నారా లోకేష్ ఫ్యామిలీ

Duvvada Srinivas: దివ్వెల మాధురితో దువ్వాడ శ్రీనివాస్ నిశ్చితార్థం.. ఉంగరాలు తొడిగారుగా! (video)

జమ్మూలో బాధ్యతలు.. సిద్ధిపేటలో భూ వివాదం... జవానుకు కష్టాలు.. తీరేదెలా?

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments