Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్‌ను అరెస్టు చేస్తే ప్రభుత్వం ఆస్తుల ధ్వంసానికి కుట్ర : కాంగ్రెస్ (Video)

ఠాగూర్
శుక్రవారం, 20 డిశెంబరు 2024 (14:05 IST)
ఫార్ములా ఈ-కార్ రేస్‌ నిర్వహణ కోసం నిధుల మళ్లింపు కేసులో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్టు చేస్తే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి ఆ పార్టీ నేతలు కుట్ర పన్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ-కార్ రేస్ నిధుల మళ్లింపు అంశంలో మాజీ మంత్రి కేటీఆర్ వద్ద విచారణకు గవర్నర్ కూడా అనుమతి ఇచ్చారు. దీంతో ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్‌ను అరెస్టు చేస్తే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని భారాస నేతలు కుట్ర పన్నారని ఆరోపించారు. 
 
కేటీఆర్‌ను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అరెస్టు చేస్తే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని కేటీఆర్ అనుచరుడు శ్రీధర్ ఆదేశాలిచ్చినట్లు మాకు సమాచారం ఉందన్నారు. ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు తగలబట్టి అల్లర్లు, దాడులు, ధర్నాలు చేసేందుకు సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.2 కోట్ల చొప్పున ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు డబ్బును కూడా చేరవేశారని ఆరోపించారు. అందువల్ల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అదేసమయంలో బీఆర్ఎస్ నేతలపై పోలీసులు ఓ కన్నేసి ఉంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh : కవితను టీడీపీలోకి తీసుకోవడం జగన్‌తో పొత్తు పెట్టుకోవడం ఒకటే

ప్రజలకు పనికొచ్చే వ్యాజ్యాలు వేయండి, పవన్ ఫోటోపై కాదు: హైకోర్టు చురకలు

Thar: టైర్ కింద నిమ్మకాయ పెట్టి యాక్సిలేటర్ అదిమింది.. కారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి..? (video)

చంద్రబాబు బావిలో దూకి చావడం బెటర్: మాజీ సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు

Army: నేపాల్‌లో కొనసాగుతున్న అశాంతి.. అమలులో కర్ఫ్యూ- రంగంలోకి సైన్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

తర్వాతి కథనం
Show comments