Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాతల కష్టాలను హీరోలు పట్టించుకోవడం లేదు : దిల్ రాజు

ఠాగూర్
బుధవారం, 5 మార్చి 2025 (14:55 IST)
సినీ హీరోలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. నిర్మాతల కష్టాలను హీరోలు పట్టించుకోవడం లేదన్నారు. పైరసీ వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని, హీరోలు మాత్రం నిర్మాతల నష్టపోతే మాకేంటి అనే ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. 
 
ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, సినిమా పైరసీకి గురైతే నిర్మాత తీవ్రంగా నష్టపోతుండగా హీరోలు, ఇతర ఆర్టిస్టులు మాత్రం తమకేమిటి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీని పైరసీ సమస్య తీవ్రంగా వేధిస్తుందన్నారు. సినిమా పైరసీకి గురైతే నిర్మాత మాత్రమే నష్టపోతున్నారని, హీరోలు సురక్షితంగా ఉంటున్నారన్నారు. 
 
నిర్మాత కష్టాన్ని పట్టించుకోకుండా తదుపరి ప్రాజెక్టులో బిజీగా మారిపోతున్నారని చెప్పారు. నిర్మాత నష్టపోతే మాకేంటి అనే ధోరణి సరికాదన్నారు. తమ వరకు వస్తే కానీ ఆ నొప్పి తెలియదని అన్నారు. త్వరలోనే ఈ విషయంపైనా మీటింగ్ పెట్టుకుంటామని ఆయన చెప్పారు. అలాగే, పైరసీపై తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంపై దృష్టిసారించినట్టు దిల్ రాజు వెల్లడించారు. ఇదే విషయంపై ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీజేపీ నేత మాధవి లత ఎలైట్ హిల్స్ అపార్ట్‌మెంట్ వివాదం.. ఏం జరిగింది?

Priyanka Gandhi గాజాలో అలా జరుగుతుంటే.. మోదీ సర్కారు ఇలా ప్రవర్తిస్తే ఎలా? ప్రియాంక గాంధీ

సింధూర్ పెడుతుండగా వణికిన వరుడు చేయి, పెళ్లి రద్దు చేసిన వధువు

Nara Lokesh: తల్లికి వందనం పథకంలో రెండు వేలు నా జేబులో పడ్డాయా? నిరూపించకపోతే? (video)

NEET UG 2025 results: నీట్ యూజీ 2025 ఫలితాలు.. టాప్‌లో మహేష్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments