Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాతల కష్టాలను హీరోలు పట్టించుకోవడం లేదు : దిల్ రాజు

ఠాగూర్
బుధవారం, 5 మార్చి 2025 (14:55 IST)
సినీ హీరోలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. నిర్మాతల కష్టాలను హీరోలు పట్టించుకోవడం లేదన్నారు. పైరసీ వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని, హీరోలు మాత్రం నిర్మాతల నష్టపోతే మాకేంటి అనే ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. 
 
ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, సినిమా పైరసీకి గురైతే నిర్మాత తీవ్రంగా నష్టపోతుండగా హీరోలు, ఇతర ఆర్టిస్టులు మాత్రం తమకేమిటి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీని పైరసీ సమస్య తీవ్రంగా వేధిస్తుందన్నారు. సినిమా పైరసీకి గురైతే నిర్మాత మాత్రమే నష్టపోతున్నారని, హీరోలు సురక్షితంగా ఉంటున్నారన్నారు. 
 
నిర్మాత కష్టాన్ని పట్టించుకోకుండా తదుపరి ప్రాజెక్టులో బిజీగా మారిపోతున్నారని చెప్పారు. నిర్మాత నష్టపోతే మాకేంటి అనే ధోరణి సరికాదన్నారు. తమ వరకు వస్తే కానీ ఆ నొప్పి తెలియదని అన్నారు. త్వరలోనే ఈ విషయంపైనా మీటింగ్ పెట్టుకుంటామని ఆయన చెప్పారు. అలాగే, పైరసీపై తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంపై దృష్టిసారించినట్టు దిల్ రాజు వెల్లడించారు. ఇదే విషయంపై ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments