నిర్మాతల కష్టాలను హీరోలు పట్టించుకోవడం లేదు : దిల్ రాజు

ఠాగూర్
బుధవారం, 5 మార్చి 2025 (14:55 IST)
సినీ హీరోలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. నిర్మాతల కష్టాలను హీరోలు పట్టించుకోవడం లేదన్నారు. పైరసీ వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని, హీరోలు మాత్రం నిర్మాతల నష్టపోతే మాకేంటి అనే ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. 
 
ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, సినిమా పైరసీకి గురైతే నిర్మాత తీవ్రంగా నష్టపోతుండగా హీరోలు, ఇతర ఆర్టిస్టులు మాత్రం తమకేమిటి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీని పైరసీ సమస్య తీవ్రంగా వేధిస్తుందన్నారు. సినిమా పైరసీకి గురైతే నిర్మాత మాత్రమే నష్టపోతున్నారని, హీరోలు సురక్షితంగా ఉంటున్నారన్నారు. 
 
నిర్మాత కష్టాన్ని పట్టించుకోకుండా తదుపరి ప్రాజెక్టులో బిజీగా మారిపోతున్నారని చెప్పారు. నిర్మాత నష్టపోతే మాకేంటి అనే ధోరణి సరికాదన్నారు. తమ వరకు వస్తే కానీ ఆ నొప్పి తెలియదని అన్నారు. త్వరలోనే ఈ విషయంపైనా మీటింగ్ పెట్టుకుంటామని ఆయన చెప్పారు. అలాగే, పైరసీపై తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంపై దృష్టిసారించినట్టు దిల్ రాజు వెల్లడించారు. ఇదే విషయంపై ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.20 కోట్ల ఆస్తి కోసం భర్తను కిడ్నాప్ చేసింది.. కానీ పోలీసులకు చిక్కింది.. ఎలా?

టెలివిజన్ నటి లైంగిక వేధింపులు.. ఫ్రెండ్ రిక్వెస్ట్ కొంపముంచింది..

తనను ప్రేమించను అన్నందుకు బాలికను తుపాకీతో కాల్చిన దుండగుడు (video)

Chevireddy: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టు చేసిన పోలీసులు - 12మంది అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments