Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు ఒకటి నుంచి టాలీవుడ్‌లో షూటింగులు బంద్

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (15:57 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి సినిమా షూటింగులు ఆగిపోనున్నాయి. నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సినిమా షూటింగులు ఆగిపోనున్నాయి. ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయానికి ఫిల్మ్ చాంబర్ కూడా మద్దతు ప్రకటించింది. 
 
సినీ నిర్మాణంలో అధిక వ్యయం భరించలేకపోతున్నామంటూ గత కొంతకాలంగా నిర్మాతలు వాపోతున్న విషయం తెల్సిందే. దీనికితోడు ఒక కొత్త చిత్రాన్ని విడుదలైన కొన్ని వారాల తర్వాత ఓటీటీలకు ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌ను వారు తెరపైకి తెచ్చారు. 
 
కాగా, షూటింగుల నిలిపివేతపై నిర్మాత దిల్ రాజు కీలక ప్రకటన చేయగా, ఆయనకు చిన్నాపెద్దా నిర్మాతలంతా ఒక్కతాటిపైకి వచ్చి మద్దతు ప్రకటించారు. అయితే, ఒకటో తేదీ నుంచి ఆగిపోయే షూటింగులను తిరిగి ఎపుడు పునరుద్ధరిస్తారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 
 
దీనిపై 24 క్రాఫ్టులతో మాట్లాడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. దీంతో సోమవారం నుంచి షూటింగులు ఆగిపోనున్నాయి. మరోవైపు, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ మాత్రం నిర్మాత దిల్ రాజు నిర్ణయాన్ని వ్యతిరేకించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వచ్ఛ మహానాడు, జీరో-వేస్ట్ ఈవెంట్‌.. 50వేల మంది ప్రతినిధులు హాజరు

వివాహేతర సంబంధం: 40 ఏళ్ల వివాహిత, 25 ఏళ్ల యువకుడు.. ఆపై ఆత్మహత్య.. ఎందుకు?

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments