Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు ఒకటి నుంచి టాలీవుడ్‌లో షూటింగులు బంద్

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (15:57 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి సినిమా షూటింగులు ఆగిపోనున్నాయి. నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సినిమా షూటింగులు ఆగిపోనున్నాయి. ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయానికి ఫిల్మ్ చాంబర్ కూడా మద్దతు ప్రకటించింది. 
 
సినీ నిర్మాణంలో అధిక వ్యయం భరించలేకపోతున్నామంటూ గత కొంతకాలంగా నిర్మాతలు వాపోతున్న విషయం తెల్సిందే. దీనికితోడు ఒక కొత్త చిత్రాన్ని విడుదలైన కొన్ని వారాల తర్వాత ఓటీటీలకు ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌ను వారు తెరపైకి తెచ్చారు. 
 
కాగా, షూటింగుల నిలిపివేతపై నిర్మాత దిల్ రాజు కీలక ప్రకటన చేయగా, ఆయనకు చిన్నాపెద్దా నిర్మాతలంతా ఒక్కతాటిపైకి వచ్చి మద్దతు ప్రకటించారు. అయితే, ఒకటో తేదీ నుంచి ఆగిపోయే షూటింగులను తిరిగి ఎపుడు పునరుద్ధరిస్తారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 
 
దీనిపై 24 క్రాఫ్టులతో మాట్లాడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. దీంతో సోమవారం నుంచి షూటింగులు ఆగిపోనున్నాయి. మరోవైపు, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ మాత్రం నిర్మాత దిల్ రాజు నిర్ణయాన్ని వ్యతిరేకించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Three Capitals: 2029 తర్వాత తాడేపల్లి నుంచే జగన్ కార్యకలపాలు- సజ్జల మాటల అర్థం ఏంటి?

India First AI Village: భారతదేశంలోనే మొట్టమొదటి ఏఐ గ్రామం ఎక్కడుందో తెలుసా?

86 శాతం పనులు పూర్తి చేసుకున్న భోగాపురం ఎయిర్ పోర్ట్-రామ్మోహన్ నాయుడు

Amaravati: అమరావతిలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో నోవోటెల్ హోటల్

శ్మశానవాటిక లోపల ఓ మహిళ సెక్స్ రాకెట్ నడిపింది.. చివరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

తర్వాతి కథనం
Show comments