Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్ తమిళసైను కలిసిన పద్మవిభూషణ్ చిరంజీవి దంపతులు

సెల్వి
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (21:45 IST)
Chiranjeevi
తెలంగాణ గవర్నర్, డా. తమిళిసై సౌందరరాజన్, శుక్రవారం నాడు రాజ్‌భవన్‌లో మెగాస్టార్ చిరంజీవికి తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. పద్మవిభూషణ్‌తో ప్రతిష్టాత్మకమైన గుర్తింపు పొందినందుకు చిరంజీవిని సత్కరించారు. 
 
మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో శుక్రవారం గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ సౌందరరాజన్ చిరంజీవికి పుష్పగుచ్ఛాన్ని అందించి, చిత్రసీమలో అంతకు మించి ఆయన సాధించిన విశేషమైన విజయాలకు గాను ప్రశంసించారు. తనను సత్కరించినందుకు గాను మెగాస్టార్ చిరంజీవి గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
 
ఇంకా చిరంజీవి మాట్లాడుతూ, "ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు నేను నిజంగా వినయపూర్వకంగా, కృతజ్ఞతతో ఉన్నాను. ఇది నా కెరీర్‌లో నా అభిమానులు, శ్రేయోభిలాషుల నుండి నాకు లభించిన ప్రేమ, మద్దతుకు నిదర్శనం." అంటూ పేర్కొన్నారు.
 
అలాగే గవర్నర్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాని ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో చిరంజీవి ముఖ్యమైన పాత్రను పేర్కొంటూ, తన సినిమాల ద్వారా తెలుగు సంస్కృతి, భాషను ప్రోత్సహించడంలో చిరంజీవి నిబద్ధతను కొనియాడారు. సామాజిక సమస్యలపై అవగాహన పెంపొందించడంలో ఆయన ప్రయత్నాలను, ధార్మిక కార్యక్రమాలకు ఆయన చేసిన సహకారాన్ని ఆమె మరింత మెచ్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

MBBS Student: వియత్నాంలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థి మృతి

తెలంగాణ: రూ.5.21 లక్షల అబార్షన్ కిట్లు, మందులు కూడా స్వాధీనం

CPI Narayana: పవన్ ఎందుకు విడాకులు ఇచ్చాడు.. ఫామ్‌ హౌస్‌లో ఆ పని చేశాడు.. అరెస్ట్ చేయాలి? (video)

One-To-One Meeting: చంద్రబాబు-పవన్ మీట్.. ఏం చర్చించారో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments