Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీచర్‌గా అవతారమెత్తిన టాలీవుడ్ బ్యూటీ

టాలీవుడ్ బ్యూటీ ఒకరు టీచర్‌గా అవతారమెత్తారు. ఆమె ఎవరో కాదు... రెజీనా. హైదరాబాద్, అమీర్‌పేట్‌లోని ప్రభుత్వ పాఠశాలలో కొద్దిసేపు పాఠాలు చెప్పి.. ఆ పాఠశాల విద్యార్థులతో పాటు.. హైదరాబాద్ నగర వాసులను ఆశ్చర్

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (10:46 IST)
టాలీవుడ్ బ్యూటీ ఒకరు టీచర్‌గా అవతారమెత్తారు. ఆమె ఎవరో కాదు... రెజీనా. హైదరాబాద్, అమీర్‌పేట్‌లోని ప్రభుత్వ పాఠశాలలో కొద్దిసేపు పాఠాలు చెప్పి.. ఆ పాఠశాల విద్యార్థులతో పాటు.. హైదరాబాద్ నగర వాసులను ఆశ్చర్యపరిచారు.
 
ఇంతకీ ఆమె నిజంగా ఉపాధ్యాయురాలిగా మారలేదండోయ్. 'మార్పు కోసం విద్య' అనే కార్యక్రమంలో భాగంగా టీచర్‌గా అవతారమెత్తారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త స్వామి అగ్నివేష్, మాజీ మంత్రి జె.గీతారెడ్డి, మాజీ మిసెస్ ఇండియా శిల్పారెడ్డి, కార్యక్రమ వ్యవస్థాపకుడు చైతన్య తదితరులు పాల్గొనగా, రెజీనా ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు, విద్యా వ్యవస్థ మార్పుకోసం శ్రీకారం చుట్టే ఇటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందని, ప్రతివారంలో కనీసం 2 గంటల పాటు ఏదో ఒక ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెబుతానని హామీ ఇచ్చారు. 
 
ముఖ్యంగా, లాభాపేక్ష లేకుండా ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ఎంతో మంది వాలంటీర్లు అవసరమని, ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులు నుంచి విద్యావంతులైన యువతీ యువకులవరకు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కనీసం వారికి 2 గంటలపాటు బోధన చేయడానికి రావాలని ఆమె పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments