టీచర్‌గా అవతారమెత్తిన టాలీవుడ్ బ్యూటీ

టాలీవుడ్ బ్యూటీ ఒకరు టీచర్‌గా అవతారమెత్తారు. ఆమె ఎవరో కాదు... రెజీనా. హైదరాబాద్, అమీర్‌పేట్‌లోని ప్రభుత్వ పాఠశాలలో కొద్దిసేపు పాఠాలు చెప్పి.. ఆ పాఠశాల విద్యార్థులతో పాటు.. హైదరాబాద్ నగర వాసులను ఆశ్చర్

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (10:46 IST)
టాలీవుడ్ బ్యూటీ ఒకరు టీచర్‌గా అవతారమెత్తారు. ఆమె ఎవరో కాదు... రెజీనా. హైదరాబాద్, అమీర్‌పేట్‌లోని ప్రభుత్వ పాఠశాలలో కొద్దిసేపు పాఠాలు చెప్పి.. ఆ పాఠశాల విద్యార్థులతో పాటు.. హైదరాబాద్ నగర వాసులను ఆశ్చర్యపరిచారు.
 
ఇంతకీ ఆమె నిజంగా ఉపాధ్యాయురాలిగా మారలేదండోయ్. 'మార్పు కోసం విద్య' అనే కార్యక్రమంలో భాగంగా టీచర్‌గా అవతారమెత్తారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త స్వామి అగ్నివేష్, మాజీ మంత్రి జె.గీతారెడ్డి, మాజీ మిసెస్ ఇండియా శిల్పారెడ్డి, కార్యక్రమ వ్యవస్థాపకుడు చైతన్య తదితరులు పాల్గొనగా, రెజీనా ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు, విద్యా వ్యవస్థ మార్పుకోసం శ్రీకారం చుట్టే ఇటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందని, ప్రతివారంలో కనీసం 2 గంటల పాటు ఏదో ఒక ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెబుతానని హామీ ఇచ్చారు. 
 
ముఖ్యంగా, లాభాపేక్ష లేకుండా ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ఎంతో మంది వాలంటీర్లు అవసరమని, ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులు నుంచి విద్యావంతులైన యువతీ యువకులవరకు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కనీసం వారికి 2 గంటలపాటు బోధన చేయడానికి రావాలని ఆమె పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం : పవన్ కళ్యాణ్

Komatireddy: ఏపీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పవన్ కల్యాణ్‌తో భేటీ అవుతారా?

ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రక్షణ తయారీ కేంద్రాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments