జనం పిచ్చోళ్ళను చేయొద్దు : టీడీపీ - బీజేపీలకు తమ్మారెడ్డి

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ తీరని అన్యాయం చేసిందనే భావన ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. అలాగే, నిన్నామొన్నటివరకు బీజేపీ వైఖరిని ఆకాశానికెత్తిన అధికార టీడీపీ నేతలు ఇపుటు కమలనాథులపై

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (17:29 IST)
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ తీరని అన్యాయం చేసిందనే భావన ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. అలాగే, నిన్నామొన్నటివరకు బీజేపీ వైఖరిని ఆకాశానికెత్తిన అధికార టీడీపీ నేతలు ఇపుటు కమలనాథులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా, విభాజిత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై గొడవ జరుగుతోంది. ఇదే అంశంపై టీడీపీ, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. 
 
వీటిపై ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ, ఆరు నెలల క్రితం వరకు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఈగ వాలనివ్వని టీడీపీ నేతలు ప్రస్తుతం దుమ్మెత్తిపోస్తున్నారని, టీడీపీ నేతలు, బీజేపీ నేతల పరస్పర ఆరోపణలు, విమర్శలతో ప్రజలు అయోమయంలో పడిపోయారని అన్నారు.
 
'ప్రజలను తికమకపెట్టొద్దు. విడిపోయి కొట్టుకోండి. రెండు ప్రభుత్వాల్లో (కేంద్రంలో బీజేపీ, ఏపీలో టీడీపీ) మీరే ఉంటారు.. ఒకరినొకరు తిట్టుకుంటారు! టీవీ ఛానెల్స్‌‌లో అల్లరి చేస్తారు! పేపర్లలో అల్లరి చేస్తారు! జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారా? లేకపోతే, జనం పిచ్చోళ్లని అనుకుంటున్నారా? మీరు (బీజేపీ-టీడీపీ) ఏమనుకుంటున్నారో ముందు తేల్చండి! నిజానిజాలు చెప్పండి! అదే నా కోరిక' అని తమ్మారెడ్డి ఘాటుగా మాట్లాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుఫానుగా మారనున్న అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

పాఠాశాల ఐదో అంతస్థు నుంచి దూకేసిన పదవ తరగతి బాలిక.. కారణం ఏంటి?

బెంగుళూరులో ఆంధ్రా విద్యార్థిని దారుణ హత్య

'నిన్ను గర్భవతిని చేయాలి... మన బిడ్డ కావాలి' : మహిళతో ఎమ్మెల్యే సంభాషణ

బంగాళాఖాతంలో అల్పపీడనం: నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీలో భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments