Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన వాణి జయరాం అంత్యక్రియలు

Webdunia
ఆదివారం, 5 ఫిబ్రవరి 2023 (18:23 IST)
సుప్రసిద్ధ గాయని వాణీ జయారం అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. ఆమె భౌతికాయానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పించారు. వాణీ జయరాం శనివారం తన నివాసంలోనే కన్నుమూసిన విషయం తెల్సిందే. పడక గదిలో కిందపడటంతో తలకు బలమైన గాయం తగిలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాలు విడిచారు. అయితే, ఆమె నుదుటిపై గాయం ఉండటంతో వాణీ జయరాం మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించారు. 
 
కాగా, 78 యేళ్ళ వాణీ జయరాం చెన్నై నుంగంబాక్కంలోని తన నివాసంలో ఒంటరిగా జీవిస్తున్నారు. ఈమె భర్త గత 2018లో చనిపోయారు. అప్పటి నుంచి ఆ ఇంట్లో ఆమె ఉంటున్నారు. ఆమె ఇంట్లో మలర్కొడి అనే పనిమనిషి పని చేస్తున్నారు. వాణి జయరాం కిందపడిన సమయంలో పని మనిషి కూడా లేరు. 
 
మరోవైపు, వాణీ జయరాం భౌతికకాయానికి ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదివారం నివాళులు అర్పించారు. అలాగే, మరికొందరు సినీ ప్రముఖులు కూడా అంజలి ఘటించారు. ఆ తర్వాత ఆమె భౌతికకాయాన్ని అంతిమయాత్రగా బీసెంట్ నగరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments