కోలీవుడ్‌లో మరో విషాదం - హాస్య నటుడు మయిల్ స్వామి శివైక్యం

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (12:06 IST)
తమిళ చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు మయిల్ స్వామి ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మహాశివరాత్రి సందర్భంగా శనివారం రాత్రంతా చెన్నై నగరంలోని ఓ శివాలయంలో జరిగిన శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం ఇంటికి వస్తుండగా, గుండె నొప్పి వచ్చింది. 
 
దీంతో ఆయన్ను హుటాహుటిన చెన్నై పోరూరులోని శ్రీ రామచంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి, మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారని చెప్పారు. ఆయన వయసు 57 యేళ్లు. మయిల్ స్వామి మరణంతో కోలీవుడ్ ఇండస్ట్రీ విషాద చాయలు అలముకున్నాయి. ఆయన మరణం పట్ల అనేక మంది సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు.
 
ఈయన 1984లో కె.భాగ్యరాజ్ నటించిన "దావణి కనవుగల్" అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన మయిల్ స్వామి ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటిస్తూ ప్రముఖ హాస్య నటుడుగా గుర్తింపు పొందారు. దివంగత వివేక్ - మయిల్ స్వామి, హాస్య నటుడు వడివేలు - మయిల్ స్వామి కాంబినేషన్‌లో వచ్చిన అనేక హాస్య సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. 40 యేళ్ళ సినీ కెరీర్‌లో దాదాపుగా 200కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన... గత యేడాది వచ్చిన "ది లెజెండ్" చిత్రంలోనూ నటించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఉప్పాడ వచ్చి మీతో తిట్లు తింటా, అలాంటి పనులు చేయను: పవన్ కల్యాణ్

దుబాయ్‌లో దీపావళి అద్భుతాన్ని అనుభవించండి

18 మంది మత్య్సకారుల కుటుంబాలకు రూ. 90 లక్షల బీమా అందించిన డిప్యూటీ సీఎం పవన్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరం కానున్న బీజేపీ.. ఎందుకో తెలుసా?

కేసీఆరే అడిగినా బీఆర్ఎస్‌లోకి తిరిగి రాను.. కేటీఆర్‌కు వెన్నుపోటు తప్పదు.. కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

తర్వాతి కథనం
Show comments