Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకిస్తున్న కరెంట్ బిల్లులు - తాప్సీ ఇంటికి రూ.36 వేల బిల్లు

Webdunia
ఆదివారం, 28 జూన్ 2020 (16:14 IST)
లాక్డౌన్ సమయంలో కరెంట్ బిల్లులు తేరుకోలేని షాకిస్తున్నాయి. ఈ బిల్లులను చూసిన విద్యుత్ వినయోగదారులు బంబేలెత్తిపోతున్నారు. రెండు మూడు వేలు వచ్చే కరెంట్ బిల్లులు ఇపుడు ఏకంగా పది నుంచి 20 రెట్లు అదనంగా వస్తున్నాయి. వాటిని చూసిన విద్యుత్ వినియోగదారులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. 
 
తాజాగా, సినీ నటి తాప్సీకి ఏకంగా రూ.36 వేలో కరెంట్ బిల్లు వచ్చింది. దాన్ని చూసిన ఈ అమ్మడు ఒకింత షాక్‌కు గురైంది. ఆ తర్వాత తేరుకుని తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. 
 
ఇటీవల అలనాటి అందాల భామ రాధ కుమార్తె, హీరోయిన్‌ కార్తీక ఇంటికి లక్ష రూపాయల కరెంట్‌ బిల్లు వచ్చింది. ఇపుడు తాప్సీ వంతు వచ్చింది. తాప్సీకి 36,000 రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. 
 
సాధారణ రోజుల్లో వచ్చే బిల్లు కంటే ఈ నెలలో (జూన్‌) దాదాపు 10 రెట్లు బిల్లు ఎక్కువ రావడంతో తాప్సీ షాక్‌కు గురైంది. ట్వీటర్‌ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. వారానికో రోజు వెళ్లి వచ్చే ఇంటికి పెద్దమొత్తం కరెంట్‌ బిల్లు రావడం ఏంటని వ్యంగ్యంగా తన అసంతృప్తిని వెలిబుచ్చింది.
 
'ఇది మా అపార్ట్‌మెంట్‌ బిల్లు. క్లీనింగ్‌ కోసమని వారంలో ఒక రోజు ఈ ఆపార్ట్‌మెంట్‌కు వెళ్తుంటాం. మాములు రోజుల్లో ఎవరూ ఉండరు. ఈ బిల్లు చూస్తుంటే మాకు తెలియకుండానే ఎవరో ఈ ఆపార్ట్‌మెంట్‌ను వినియోగిస్తున్నారనే భయం కలుగుతోంది. నిజాన్ని వెలికితీసేందుకు నాకు సహాయం చేయడంటూఎలక్ట్రిసిటీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌కు ట్యాగ్ చేస్తూ తాప్సీ ట్వీట్‌ చేసింది. 
 
మూడు నెలల వ్యవధిలోనే పెద్ద మొత్తంలో కరెంట్‌ బిల్లు పెరగడానికి కారణం ఏంటి? ఏ రకమైన బిల్లును వసూలు చేస్తున్నారని విద్యుత్ శాఖ అధికారులను ఆమె ప్రశ్నించారు. కాగా తాప్సీ ట్వీట్‌పై స్పందించిన ఎలక్ట్రిసిటీ అధికారులు.. మీటర్‌ రీడింగ్‌ ఆధారంగా తాము బిల్లు జనరేట్ చేశామనీ, ఇందులో తమ తప్పేం లేదని చెప్పుకొచ్చారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అమ్మాయితో సంబంధం.. వదులుకోమని చెప్పినా వినలేదు.. ఇంటి వద్ద గొడవ.. యువకుడి హత్య

Telangana: తెలంగాణ బియ్యానికి దేశ వ్యాప్తంగా అధిక డిమాండ్: డీకే అరుణ

బీహార్ తరహాలో దేశవ్యాప్తంగా ఓటర్ల తనిఖీలు : ఎన్నికల సంఘం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments