Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ధోనీ బయోపిక్' హీరో నటించిన చివరి చిత్రం రిలీజ్ ఎపుడంటే?

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (16:37 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎంఎస్ ధోనీ బయోపిక్. ఈ చిత్రంలో హీరోగా నటించిన బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇటీవల బలవన్మరణానికి పాల్పడిన విషయం తెల్సిందే. ఈ యువ హీరో మృతితో ప్రతి ఒక్క సెలెబ్రిటీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అయితే, సుశాంత్ నటించిన చివరి చిత్రం దిల్ బెచారా. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. 
 
ముఖేశ్‌ ఛాబ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంజనాసంఘి హీరోయిన్‌గా నటిస్తోండగా.. సైఫ్‌ అలీఖాన్‌ కీలకపాత్రలో నటించాడు. ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్దమైంది. జులై 24వ తేదీన డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో దిల్‌ బెచారా విడుదల కానుంది. 
 
ప్రేమ, ఆశ, ముగింపులేని జ్ఞాపకాల సమ్మేళనం. అందరి మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సుశాంత్‌ సినిమాను సెలబ్రేట్‌ చేసుకుంటూ జులై 24న మీ ముందుకొస్తుందని డిస్నీ హాట్‌స్టార్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. హాలీవుడ్‌ రొమాంటిక్‌ డ్రామా ది ఫాల్ట్‌కు రీమేక్‌గా దిల్‌ బెచారా తెరకెక్కింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Red Book: నేను కూడా రెడ్ బుక్ నిర్వహిస్తున్నాను.. బీఆర్ఎస్ ఫైర్‌బ్రాండ్ హరీష్ రావు

BJP MP Etela Rajender: రాజధాని లేకపోయినా ఏపీ అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది

మహిళను స్క్రూడ్రైవర్‌తో 18 సార్లు పొడిచి హత్య చేసిన వ్యక్తి.. ఎక్కడ?

హిందువులు యూరిన్ డ్రింకర్స్ - రేపిస్ట్ కల్చర్స్... వజాహత్‌ ఖాన్‌పై ఫిర్యాదు

దమ్ముంటే సస్పెండ్ చేయండి.. మీ అందరి బాగోతాలు వెల్లడిస్తా : రాజాసింగ్ బస్తీమే సవాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments