Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్డౌన్ తర్వాత విదేశాల్లో విడుదలైన తొలి బాలీవుడ్ సినిమా ఏది?

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (15:06 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు అనేక మంది పిట్టల్లా రాలిపోతున్నారు. వేలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. దీంతో ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వీలుగా ప్రపంచ దేశాలన్నీ తమ వీలునుబట్టి లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. అలాంటి దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. 
 
అయితే, ప్రస్తుతం ఇక్కడ కొత్తగా నమోదయ్యే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో సినిమా థియేటర్స్‌ను కూడా తెరిచేందుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఫలితంగా 25వ తేదీ నుంచి థియేటర్స్ తెరుచుకున్నాయి. దీంతో రిలీజ్ కావ‌ల‌సిన సినిమాల‌తో పాటు గ‌తంలో విడుద‌లైన సినిమాల‌ని కూడా రిలీజ్ చేస్తున్నారు. ద‌ర్శ‌కుడు రోహిత్ శెట్టి రూపొందించిన 'గోల్ మాల్ ఎగైన్‌'ని న్యూజిలాండ్‌లో రీరిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు.
 
బాలీవుడ్‌లో గోల్‌మాల్ సిరీస్‌తో వ‌చ్చిన‌ 'గోల్‌మాల్ ఎగైన్' చిత్రాన్ని రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఓ ఇంట్లో ఫ్రెండ్స్ గ్యాంగ్ దెయ్యాల నుంచి ఎలాంటి అనుభవం పొందారన్నదే ఈ చిత్ర కథాంశం. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, పరిణితీ చోప్రా, తుషార్ కపూర్, టబు, కునాల్ కేము, శ్రేయాస్ టాల్పేడ్ ప్రధాన పాత్రలలో న‌టించారు. 
 
2017లో విడుద‌లైన ఈ చిత్రం నేటి నుంచి న్యూజిలాండ్ థియేట‌ర్‌లో అందుబాటులో ఉండ‌నుంది. లాక్డౌన్ త‌ర్వాత విడుద‌లైన తొలి హిందీ చిత్రం ఇదే కావ‌డం విశేషం. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందిస్తుంద‌ని ద‌ర్శ‌కుడు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదనీ యువకుడు బలవన్మరణం...

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments