Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎందుకొచ్చిన బాధ.. అందుకే బాలీవుడ్‌ను వద్దనుకున్నాను.. రమ్యకృష్ణ

ఎందుకొచ్చిన బాధ.. అందుకే బాలీవుడ్‌ను వద్దనుకున్నాను.. రమ్యకృష్ణ
, శుక్రవారం, 19 జూన్ 2020 (14:59 IST)
బాలీవుడ్‌లో బంధుప్రీతి ఎక్కువని.. తద్వారా బ్యాక్ గ్రౌండ్ లేని వారికి ఆదరణ అంతగా లభించదనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు హీరోయిన్లు బాలీవుడ్ గురించి ఏకిపారేస్తున్నారు. ఇందుకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణమే కారణం.

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ ఉన్నట్టుండి ఆత్మహత్యకు పాల్పడటం.. ఇందుకు డిప్రెషనే కారణమని తెలియరావడంతో.. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై పలువురు ఆరోపణలు చేస్తున్నారు. బాలీవుడ్ బయట కనిపించేంత అందమైంది కాదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
తాజాగా దక్షిణాది సినీ పరిశ్రమలో రాణించిన హీరోయిన్ రమ్యకృష్ణ బాలీవుడ్‌పై స్పందించింది. అయితే బాలీవుడ్‌లో ఆమె ఎందుకు రాణించలేదో చెప్పుకొచ్చింది. దక్షిణాది అగ్ర హీరోలందరితో నటించిన ఆమె...హీరోలతో సమానమైన స్టార్‌డమ్‌ను ఆమె సంపాదించింది. హీరోయిన్‌గా విజయవంతమైన కెరీర్‌ను సొంతం చేసుకున్న ఆమె... ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా అదరగొడుతోంది. క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువవుతోంది.
 
కానీ అందం, అభినయం కలగలిసిన రమ్యకృష్ణ... హీరోయిన్‌గా బాలీవుడ్‌లో మాత్రం విజయవంతం కాలేకపోయింది. అయితే తాజాగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ఫైటర్' ద్వారా రమ్య మరోసారి బాలీవుడ్ లోకి ఎంట్రీ  ఇవ్వబోతోంది.
 
ఈ సందర్భంగా ఓ ఆంగ్ల మీడియాతో రమ్యకృష్ణ మాట్లాడుతూ బాలీవుడ్‌లో ఎందుకు సక్సెస్ కాలేకపోయిందో వివరించింది. బాలీవుడ్‌లో తాను నటించిన చిత్రాలు విజయవంతం కాలేకపోయాయని చెప్పింది. సినిమాలు ఫ్లాప్ కావడంతో తనకు అవకాశాలు రాలేదని తెలిపింది. ఈ కారణం వల్లే బాలీవుడ్‌కు దూరమయ్యానని... దక్షిణాదిలో మాత్రం సక్సెస్ అయ్యానని చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుశాంత్ సింగ్ ఆత్మహత్య.. కొమరం పులి హీరోయిన్ ఏమందంటే?