Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా క్రూరమైనది సుశాంత్... : సంజయ్ నిరుపమ్

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (19:22 IST)
బాలీవుడ్ యువనటుడు, ధోనీ బయోపిక్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‍పుత్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబై, బాంద్రాలోని తన నివాసంలోనే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మరణవార్త తెలియగానే బాలీవుడ్‌తో పాటు వివిధ ప్రాంతీయ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. 
 
అయితే, ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు ఇపుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. "నిన్ను దారుణంగా హింసించిన వారి గురించి నాకు బాగా తెలుసు" అంటూ సుశాంత్‌ను ఉద్దేశించి డైరెక్టర్ శేఖర్ కపూర్ ఆవేదనాభరితంగా చేసిన ట్వీట్ చేశారు. 
 
ఇదే క్రమంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఇండస్ట్రీలోని చీకటి కోణాలను బయటపెడుతున్నారు. సుశాంత్ మరణంపై రాజకీయ నాయకుడు సంజయ్ నిరుపమ్ కూడా సంచలన ఆరోపణలు చేశారు. 2019లో 'చిచోరే' సినిమా హిట్ అయిన తర్వాత సుశాంత్ సింగ్ ఆరు సినిమాలకు సైన్ చేశాడని... అయితే కావాలనే ఆ సినిమాల నుంచి సుశాంత్‌ను తప్పించేశారని చెప్పారు. 
 
దీనికి కారణం ఎవరని ప్రశ్నించారు. హిందీ సినీ పరిశ్రమలోని క్రూరత్వం మరో స్థాయికి చేరుకుందని... ప్రతిభ కలిగిన యువ నటుడిని బలిగొందని మండిపడ్డారు. ఇపుడు మాత్రం మొసలి కన్నీరు కారుస్తోందని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఇండస్ట్రీ కారణంగా అనేక మంది యువ కళాకారాలు అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారంటూ సంజయ్ నిరుపమ్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments