Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో కొత్త వ్యక్తి అరెస్ట్

Webdunia
శనివారం, 8 మే 2021 (13:24 IST)
బాలీవుడ్ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి అందరికీ తెలిసిందే. గత ఏడాది జూన్ లో ముంబైలో తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆయన మరణాన్ని తట్టుకోలేకపోతున్నా అభిమానులు.. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా ఆయన తరపున ఎంతో మంది పేదలకు సుశాంత్ కా కిచెన్ అనే పేరుతో నిత్యావసరాలను అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆయన మరణానికి సంబంధించిన కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలో పలు అనుమానాలు ఎదురవడంతో డ్రగ్స్ కేసు బయటపడింది.
 
ఈ కేసులో ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి.. పేరు బయటపడగా ఎన్ సీ బీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై మరింత కోణంతో ఈమెతో పాటు మరో తొమ్మిది మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇదిలా ఉంటే ఇప్పటికీ ఈ కేసు దర్యాప్తులో ఉండగా.. తాజాగా ఈ డ్రగ్స్ వ్యవహారంలో హేమల్ షా అనే వ్యక్తికి సంబంధం ఉందని తేలింది. దీంతో ఎన్ సీ బీ అధికారులు అతనిని శుక్రవారం రోజు అరెస్టు చేశారు.
 
ఇక దీని గురించి ఎన్సిబీ అధికారి మాట్లాడుతూ.. సుశాంత్ సింగ్ మృతి కేసు పై విచారణ జరుపుతున్న సమయంలో డ్రగ్స్ వ్యవహారంలో హేమల్ షా అనే వ్యక్తి పాత్ర ఉన్నట్లు తమకు తెలిసిందని, దీంతో అతన్ని యాంటీ డ్రగ్ ఏజెన్సీ అధికారులు ఓ పథకం ప్రకారం అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం గోవాలో అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments