సుశాంత్‌ చాట్స్‌, ఈ-మెయిల్స్‌ డేటా కావాలి.. అడిగింది ఎవరు?

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (10:20 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ కేసు నుంచి బాలీవుడ్ డ్రగ్స్ కేసుగా మారింది. చాలా మంది సెలబ్రిటీలను ఈ కేసులో విచారించారు. కొంతమందిని అరెస్ట్ చేసి విచారణ అనంతరం విడిచిపెట్టారు. సంవత్సరం పైగా కావొస్తున్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. చాలా మంది ఈ కేసుని మర్చిపోయారు కూడా. సిబిఐ కూడా ఎన్ని విచారణలు చేసినా సుశాంత్ విషయంలో ఓ నిర్దారణకు రాలేదు.
 
మరోసారి సిబిఐ సుశాంత్ కేసులో విచారణ వేగవంతం చేయడానికి ట్రై చేస్తుంది. సుశాంత్ సింగ్‌ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన మరికొన్ని వివరాలు తెలిస్తే కేసులో మరిన్నికొత్త కోణాల్లో విచారణ చేయొచ్చు అని సిబిఐ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసు విషయంలో సీబీఐ అమెరికాను ఆశ్రయించింది. 
 
సిబిఐ మ్యూచ్‌వల్‌ లీగల్‌ అసిస్టెన్స్‌ ట్రీటీ  కింద డిలీట్‌ అయిన సుశాంత్‌ చాట్స్‌, ఈ-మెయిల్స్‌ డేటా కావాలని గూగుల్‌, ఫేస్‌బుక్‌లను కోరింది. కాలిఫోర్నియాలోని గూగుల్‌, ఫేస్‌బుక్‌ ప్రధానకార్యాలయానికి వెళ్లి సీబీఐ సుశాంత్ సోషల్ మీడియా డేటా కావాలని కోరింది. సుశాంత్‌ సింగ్‌ కేసులో సీబీఐ ఎలాంటి నిర్ధారణకు రాకపోవడంతో డిలీటైన చాట్‌, ఈ మెయిల్స్ కోరినట్లు సుశాంత్‌ ఫ్యామిలీ లాయర్‌ వికాస్‌ సింగ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments