Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో సూర్య గొంతుకైన తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి ఇకలేరు

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (12:30 IST)
ప్రముఖ హీరోలు సూర్య, అజిత్, మోహన్ లాల్, డాక్టర్ రాజశేఖర్ వంటి స్టార్ హీరోల చిత్రాలకు తెలుగులో డబ్బింగ్ చెబుతూ వచ్చిన డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి చెన్నైలో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన గుండెపోటు కారణంగా చనిపోయారు. ఊబకాయ సమస్యతో బాధపడుతూ వచ్చిన ఆయనకు శుక్రవారం ఉదయం తన నివాసంలో ఉండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయారు. దీంతో ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. 
 
తమిళ స్టార్ హీరో సూర్యకు శ్రీనివాసమూర్తి చెప్పిన డబ్బింగ్ కారణంగానే మంచి పాపులర్ అయ్యారు. సూర్య నటించిన అన్ని తెలుగు చిత్రాలకు ఆయనే డబ్బింగ్ చెబుతూ వచ్చారు. అలాగే, అజితే, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు డబ్బింగ్ చెప్పారు. జనతా గ్యారేజ్ చిత్రంలో మోహన్ లాల్ పాత్రకు ఈయనే డబ్బింగ్ చెప్పి జీవం పోశారు. 
 
ముఖ్యంగా, హీరో బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా డబ్బింగ్ చెప్పడంలో శ్రీనివాసమూర్తికి మించినవారు లేరని చెప్పొచ్చు. తెలుగు హీరో డాక్టర్ రాజశేఖర్‌కు సాయికుమార్ అందుబాటులో లేని సమయంలో కూడా శ్రీనివాసమూర్తి డబ్బింగ్ చెప్పసాగారు. అలాంటి గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్‌ను తెలుగు చిత్రపరిశ్రమ కోల్పోయింది. 
 
అయితే, చిత్రపరిశ్రమలోని డబ్బింగ్ ఆర్టిస్టులకు దక్కాల్సిన గౌరవమర్యాదలు దక్కడం లేదని దివగంత అక్కినేని నాగేశ్వర రావు వంటి వారు అంటుండేవారు. శ్రీనివాస మూర్తి విషయంలోనూ ఇదే జరిగింది. అందుకే ఆయన తెలుగులో ఎక్కువ సినీ అవకాశాలు పొందలేకపోయారు. అయితే, హీరో సూర్యకి డబ్బింగ్ చెప్పిన తర్వాత శ్రీనివాస రావు మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments