Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్

ఠాగూర్
గురువారం, 14 నవంబరు 2024 (19:03 IST)
సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్నారు. ఆయన హీరోగా నటించిన "పిల్లా నువ్వులేని జీవితం" సినిమా రిలీజై గురువారంతో పదేళ్లవుతోంది. 2014, నవంబరు 14వ తేదీన ఈ సినిమా తెరపైకి వచ్చింది. తొలి చిత్రంతోనే తన నటన, డ్యాన్సులతో ప్రేక్షకుల్ని సాయిదుర్గ తేజ్ ఆకట్టుకున్నారు. ఆల్ రౌండ్ పర్ ఫార్మెన్స్‌ కారణంగా ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. 
 
ఆ తర్వాత సుప్రీమ్, చిత్రలహరి, ప్రతిరోజు పండగే, విరూపాక్ష వంటి సూపర్ హిట్ చిత్రాలతో తన స్టార్ డమ్ పెంచుకున్నారు. మేనమామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి "బ్రో" చిత్రంలో నటించి తన డ్రీమ్ నెరవేర్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 18వ సినిమా ఎస్డీటీ 18 భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. 
 
సాయిదుర్గ తేజ్ కెరీర్‌లోనే ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతోంది. తన సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలతోనూ ప్రజల మనసులు గెల్చుకున్నారు. ఆయన 10 ఏళ్ల నట ప్రయాణం సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, సహ నటీనటులు, దర్శక నిర్మాతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేసమయంలో హైదరాబాద్ నగరంలో జరిగిన బైక్ ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments