Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్

ఠాగూర్
గురువారం, 14 నవంబరు 2024 (19:03 IST)
సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్నారు. ఆయన హీరోగా నటించిన "పిల్లా నువ్వులేని జీవితం" సినిమా రిలీజై గురువారంతో పదేళ్లవుతోంది. 2014, నవంబరు 14వ తేదీన ఈ సినిమా తెరపైకి వచ్చింది. తొలి చిత్రంతోనే తన నటన, డ్యాన్సులతో ప్రేక్షకుల్ని సాయిదుర్గ తేజ్ ఆకట్టుకున్నారు. ఆల్ రౌండ్ పర్ ఫార్మెన్స్‌ కారణంగా ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. 
 
ఆ తర్వాత సుప్రీమ్, చిత్రలహరి, ప్రతిరోజు పండగే, విరూపాక్ష వంటి సూపర్ హిట్ చిత్రాలతో తన స్టార్ డమ్ పెంచుకున్నారు. మేనమామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి "బ్రో" చిత్రంలో నటించి తన డ్రీమ్ నెరవేర్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 18వ సినిమా ఎస్డీటీ 18 భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. 
 
సాయిదుర్గ తేజ్ కెరీర్‌లోనే ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతోంది. తన సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలతోనూ ప్రజల మనసులు గెల్చుకున్నారు. ఆయన 10 ఏళ్ల నట ప్రయాణం సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, సహ నటీనటులు, దర్శక నిర్మాతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేసమయంలో హైదరాబాద్ నగరంలో జరిగిన బైక్ ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments