Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి కిడ్నాప్ కేసు.. విచారణ మరో 6 నెలలు పొడిగింపు

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (20:49 IST)
ప్రముఖ మలయాళ నటుడు, సూపర్ స్టార్ దిలీప్.. గత 2019వ సంవత్సరం టాప్ హీరోయిన్ కిడ్నాప్ కేసులో అరెస్టయ్యారు. ఈ కేసు విచారణకు అత్యున్నత న్యాయస్థానం మరో ఆరు నెలల పాటు సమయాన్ని పొడిగించింది. ఈ కేసు కేరళలోని ఎర్నాకుళం అదనపు స్పెషల్ సెషన్స్ కోర్టులో గత 2019వ సంవత్సరం నుంచి విచారణ జరుగుతోంది. 
 
అయితే ఈ కోర్టు సుప్రీం కోర్టు నిర్దేశించిన సమయంలోపు విచారణను పూర్తి చేయలేకపోయింది. కరోనా కారణంగా కేసు విచారణలో జాప్యం ఏర్పడింది. అందుచేత ఆరు నెలల పాటు సమయాన్ని పొడిగించాలని స్పెషల్ కోర్టు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 
 
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. హైకోర్టు ఈ కేసు విచారణకు ఆరునెలల పాటు సమయం ఇచ్చింది. ట్రయల్ ప్రొసీడింగ్స్ పూర్తి చేయడానికి కేరళలోని ఎర్నాకుళం అదనపు స్పెషల్ సెషన్స్ జడ్జి నుండి 2021 జనవరి 16 నాటి అభ్యర్థన మేరకు ఈ ఉత్తర్వు వచ్చింది. క్రిమినల్ ప్రొసీడింగ్స్ పూర్తి చేయడానికి గడువును సుప్రీం కోర్టు ఇంతకుముందు ఆరు నెలలు పొడిగించింది. 2021 ఫిబ్రవరి 4 లోగా విచారణ పూర్తి చేయాలని కోర్టును కోరింది
 
కరోనా మహమ్మారి, ఇతర అనివార్య కారణాల చేత విచారణ ఆలస్యం అయింది. ఈ కేసులో జాబితా చేయబడిన దాదాపు 300 మంది సాక్షులలో 82 మందిని మాత్రమే ప్రాసిక్యూషన్ పరిశీలించగలిగింది. దీంతో విచారణను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ సుప్రీం ఉత్తర్వులు జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments