Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీరాభిమానికి రజినీకాంత్ పాదాచాలనం.. ఫోటో వైరల్

Webdunia
మంగళవారం, 3 డిశెంబరు 2019 (09:25 IST)
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్... మరోమారు వార్తల్లోకెక్కారు. ఎంత ఎత్తుకు ఎదిగినా అంత సాదాసీదాగా ఉండే తలైవా.. ఇపుడు తన వీరాభిమానికి పాదాచాలనం చేసి హిమాలయా శిఖరమంత ఎత్తుకు ఎదిగిపోయారు. ప్రత్యేక ప్రతిభావంతుడుగా గుర్తింపు పొందిన ఓ వీరాభిమానికి రజినీకాంత్ పాదాచాలనం చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పుట్టినతేదీ ప్రకారం ఈ నెల 12వ తేదీన రజినీకాంత్ పుట్టినరోజు వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆయన అభిమాన సంఘాలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. 
 
అయితే, ఈ సూపర్ స్టార్ మాత్రం తన పుట్టిన తిథి, నక్షత్రం ప్రకారం సోమవారం రోజు పుట్టిన రోజును జరుపుకున్నారు. చెన్నైలోని తన నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో కేరళకు చెందిన వీరాభిమానిని ప్రత్యేకంగా పిలిపించుకుని కలిశారు. 
 
ఈ వీరాభిమాని ప్రత్యేక ప్రతిభావంతుడు కూడా. ఇతనికి రజినీకాంత్‌తో కరచాలనం చేసేందుకు రెండు చేతులు లేవు. దీంతో రజనీ అతని పాదాలను తాకి పాదచాలనం చేశారు. అతనితో కాసేపు ముచ్చటించారు. 
 
ఈ పాదాచాలానికి సంబంధించిన ఫోటోలు మాత్రం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, హీరో అయిన రాఘవ లారెన్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Konidela Village: కొణిదెల గ్రామానికి రూ.50లక్షలు ప్రకటించిన పవన్ కల్యాణ్

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments