థియేట‌ర్‌లోకి రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సుందరాంగుడు

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2022 (15:56 IST)
Krishnasai, Mauryani
తెలుగు సిల్వ‌ర్‌స్క్రీన్‌ పైకి ఓ సూప‌ర్ లవ్ ఆండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రాబోతోంది. ఎం ఏస్. కె ప్రమిద ఫిలిమ్స్ బ్యానర్ లో కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి హీరో హీరోయిన్లుగా దర్శకుడు వినయ్‌బాబు తెరకెక్కించిన చిత్రం ‘సుందరాంగుడు’. ఏవీ సుబ్బారావు సమర్పణలో చందర్‌ గౌడ్, యం.యస్‌.కె. రాజు నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 17 న  ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర‌యూనిట్ సినిమా హైలైట్స్ తెలిపింది. 
 
కృష్ణ సాయి మాట్లాడుతూ.. ‘‘నేను, చంద్ర గౌడ్‌గారు రెండేళ్లు కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాం. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేస్తున్నాం అన్నారు. కృష్ణసాయి, మౌర్యాని కాంబినేషన్ లో వచ్చే సాంగ్స్, సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. అంతేకాకుండా రామోజీఫిల్మ్ సిటీ, గోవాలోని అత్యద్భుత లొకేషన్స్ లో చిత్రీకరించిన పాటలు, కామెడీ.. సుందరాంగుడు చిత్రానికి ప్రధానాకర్షణ అని అన్నారు. ఇటీవల సుందరాంగుడు ప్రివ్యూ చూసిన సినీపెద్దలు , సెన్సార్ అధికారులు చిత్రయూనిట్ ను ప్రశంస‌లు కురిపించారు. డిసెంబర్ 17 విడుదల అవుతున్న మా సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు.. మా ‘కృష్ణసాయి ఇంటర్నేషనల్ చారిటబుల్‌ ట్రస్ట్‌’ తరఫున చాలామందికి సాయం చేస్తున్నాం. ఈ చిత్రం ద్వారా వచ్చే డబ్బుని ట్రస్ట్‌ కోసమే ఖర్చు చేయాలనుకుంటున్నాం.. అని తెలిపారు.
 
జీవా, భాషా, అమిత్ తివారి, జూనియర్ రేలంగి, మిర్చి మాధవి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఫైట్స్: రామ్ సుంకర-అశోక్ రాజ్, మ్యూజిక్: సిద్ధబాబు  కొరియోగ్రాఫర్ : నిక్సన్ పాల్ ,సూర్య కిరణ్ ,అనీష్ ,రవి కృష్ణ, కెమెరా: వెంకట్ హనుమాన్, 
ఎడిటింగ్: నందమూరి హరి,  నిర్మాతలు: బీసు చందర్ గౌడ్‌ - MSK రాజు, 
దర్శకత్వం: వినయ్ బాబు. పి.ఆర్‌.ఓ : దయ్యాల అశోక్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ మాజీ ఓఎస్డీ వద్ద విచారణ

Jagan: ఏపీ లిక్కర్ కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments