Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్‌పై సెటైర్‌లు విసిరిన అక్కినేని వారసుడు

టాలీవుడ్ హీరో 'సుమంత్' ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌పై అసహనం వ్యక్తం చేసారు. కాల్ డ్రాప్ సమస్యతో కస్టమర్లు విసిగిపోతున్నారని సోషల్ మీడియాలో వ్యంగ్యంగా చురకలంటించారు. కాల్ డ్రాప్ సమస్యకు ఎయిర్‌టెల్ ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదని ట్విట్టర్

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (12:25 IST)
టాలీవుడ్ హీరో 'సుమంత్' ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌పై అసహనం వ్యక్తం చేసారు. కాల్ డ్రాప్ సమస్యతో కస్టమర్లు విసిగిపోతున్నారని సోషల్ మీడియాలో వ్యంగ్యంగా చురకలంటించారు. కాల్ డ్రాప్ సమస్యకు ఎయిర్‌టెల్ ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్ కాస్తా వైరల్‌గా మారింది. 
 
ఈ కాల్ డ్రాప్ వ్యవహారం తనను ఎంత ఇబ్బందికి గురిచేస్తోందో సుమంత్ చెప్పకనే చెప్పారు. ఇంకా 'ఎయిర్‌టెల్ కాల్ డ్రాపింగ్ అనే కళను రెగ్యులర్‌గా ఉపయోగించడంలో విజయవంతమైందని.. అందుకు అభినందనలు..' అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్‌ను టెలికాం కంపెనీల ప్రకటన తరహాలోనే ట్వీట్ చేయడం విశేషం. 
 
నెటిజన్లు కూడా ఈ ట్వీట్‌కి స్పందిస్తూ తగు రీతిలో సెటైర్లు విసురుతున్నారు. యువకుడు, గోదావరి, గోల్కొండ హైస్కూల్ చిత్రాలతో ఆకట్టుకున్న సుమంత్.. చాలా గ్యాప్ తర్వాత గతేడాది 'మళ్లీ రావా' అనే సినిమాలో నటించి, మంచి విజయం అందుకున్నారు. మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ఈ హీరో తన తదుపరి చిత్రం ఎప్పుడు ఉంటుందో మాత్రం ఇంకా వెల్లడించలేదు.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments