Webdunia - Bharat's app for daily news and videos

Install App

''యాపిల్ సిడర్ వెనిగర్'' తాగండి అంటున్న సమంత.. ఎందుకు?

అందరినీ ఆకట్టుకునే అందం సమంత సొంతం. మధ్య తరగతి కుటుంబం నుంచి హీరోయిన్‌ స్థాయికి ఎదిగిన సమంత.. తన ప్రేమికుడు.. అక్కినేని నాగేశ్వర రావు మనువడు, నాగార్జున కుమారుడు, హీరో నాగచైతన్యను పెళ్లాడిన సంగతి తెలిస

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (12:00 IST)
అందరినీ ఆకట్టుకునే అందం సమంత సొంతం. మధ్య తరగతి కుటుంబం నుంచి హీరోయిన్‌ స్థాయికి ఎదిగిన సమంత.. తన ప్రేమికుడు.. అక్కినేని నాగేశ్వర రావు మనువడు, నాగార్జున కుమారుడు, హీరో నాగచైతన్యను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆమె అందానికి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు.

పెళ్లయ్యాక కూడా సినిమా షూటింగ్‌ల్లో బిజీ బిజీగా వున్న సమంత.. తాజాగా తన బ్యూటీ సీక్రెట్‌ను బయటపెట్టింది. 'యాపిల్ సిడర్ వెనిగర్' తన బ్యూటీకి కారణమని చెప్పుకొచ్చింది. 'ప్రతి రోజూ ఉదయం పరగడుపున యాపిల్ సిడర్ వెనిగర్ తీసుకోండి' అంటూ తన అభిమానులకు సూచించింది. గూగుల్‌లో వెతికితే మరెన్నో రెసిపీలు కనపడతాయని సమంత తెలిపింది.
 
వైద్యులు కూడా యాపిల్ సిడర్ వెనిగర్ బరువు తగ్గేందుకు.. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటున్నారు. రోజుకు రెండు స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే బరువు తగ్గొచ్చునని వారు అంటున్నారు. ఇది మెటబాలిజాన్ని మెరుగుపరిచి.. కొవ్వును నిల్వవుంచదు. తద్వారా కొవ్వు కరిగిపోతుంది. రోజుకు మూడుసార్లు ఆహారానికి ముందు ఐదు ఎమ్ఎల్ మోతాదులో దీన్ని తీసుకుంటే బరువు సమస్య నుంచి బయటపడొచ్చునని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు.
 
అయితే పరగడుపున ఐదు ఎమ్ఎల్ మోతాదులో మాత్రమే దీన్ని తీసుకోవాలని.. అధికంగా తీసుకోకూడదని వారు హెచ్చరిస్తున్నారు. అలా ఎక్కువగా తీసుకుంటే.. దంతాలపై వున్న ఎనామల్ పాడవుతుందని, గొంతు సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు వారు చెప్తున్నారు. యాపిల్ సిడర్ వెనిగర్ తీసుకున్నాక నోటిని పుక్కిలించాలి. అలా చేస్తే దంతాల ఎనామల్‌ను కాపాడినట్లవుతుంది. ఇంకా యాపిల్ సిడర్ వెనిగర్ తీసుకున్న 30 నిమిషాల తర్వాత బ్రష్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

Honour killing in Telangana: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. తెలంగాణలో పరువు హత్య

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

డబ్బు కోసం వేధింపులు.. ఆ వీడియోలున్నాయని బెదిరించారు.. దంపతుల ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments