ప్ర‌భుత్వం చేయ‌ని ప‌నులు సుకుమార్ చేశాడు హాట్యాఫ్ అంటున్న మాజీ ఎం.పి.

Webdunia
గురువారం, 27 మే 2021 (15:39 IST)
Harshakumar-sukumar
క‌రోనా కాలంలో ప్ర‌భుత్వాలు చేయ‌లేని మంచి ప‌నులు ప‌లువురు ముందుకు వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డంపై స‌ర్వ‌త్రా ప్ర‌జ‌ల్లో వారిపై పాజిటివ్ కోణం వుంది. ఇటీవ‌ల సినీమారంగానికి చెందిన ప‌లువురు త‌మ‌కు చేత‌నైనంత స్థాయిలో వేక్సిన్‌లు, ఆక్సిజ‌న్ సిలెండ‌ర్లు, నిత్యావ‌స‌ర స‌రుకులు అంద‌జేస్తున్నారు. తాజాగా సుకుమార్ రాజోలు అనే మారుమూల గ్రామంలో క‌రోనా పేషెంట్ల‌కు అందుబాటులో ఆక్సిజ‌న్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని అక్కడ ఏరియా మాజీ ఎం.పి. హ‌ర్ష‌కుమార్‌, సుకుమార్‌కు ఫోన్‌చేసి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. అదే కాకుండా చిన్న వీడియో బైట్‌ను కూడా రిలీజ్ చేశారు.
 
అందులో ఏమి చెప్పారంటే, ఈ పేండ‌మిక్ టైంలో రోగులకు స‌త్వ‌రం ఏమి కావాలో వాటిని సుకుమార్‌గారు స‌ప్ల‌యి చేశారు. 40ల‌క్ష‌లు ప్ర‌క‌టించిన 10 రోజుల్లోనే కార్య‌రూపం దాల్చారు. ఇంత త్వ‌ర‌గా ప‌నులు చేస్తార‌ని అనుకోలేదు. ఆక్సిజ‌న్ వ‌ల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడిన‌వారు ఆయ‌న‌. చాలా క‌ష్ట‌మైన ప‌నిని ప్ర‌భుత్వాలు కూడా చేయ‌లేదు. కానీ సుకుమార్ చేశాడు. ఆయ‌న‌కు ఈ ఊరి ప్ర‌జ‌ల‌పై ప్రేమ అటువంటిది. అంద‌రూ ఇలా వుంటే దేశానికి ఎంతో మేలు చేయ‌వ‌చ్చు. అని వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా త‌నకు ఫోన్ చేసి వీడియో కూడా పంపిన హ‌ర్ష‌కుమార్‌ను సుకుమార్ మీ అభిమానానికి ధ‌న్య‌వాదాలు అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు అగ్నిప్రమాదంలో ఇద్దరు టెక్కీలు మృతి

Kurnool : కర్నూలు బస్సు ప్రమాదం.. డ్రైవర్ కనిపించలేదు.. ఏఐ వీడియో వైరల్

కర్నూలు బస్సు ప్రమాదం : సీటింగ్ అనుమతితో స్లీపర్‌గా మార్చారు...

కర్నూలు ప్రమాదానికి నిర్లక్ష్యమే కారమణమా? సీఎం చంద్రబాబు హెచ్చరిక

ట్రావెల్ బస్సు యజమానులపై హత్యా కేసులు పెడతాం : టి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments