Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెలికాప్టర్‌లో చార్ ధామ్ యాత్రకు సమంత!

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (16:29 IST)
Samantha Akkineni
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల నుంచి చిన్న విరామం తీసుకుంటోంది. ఈ విరామ సమయంలో తనకు నచ్చిన ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎంజాయ్ చేస్తోంది. అక్టోబర్ 20న సమంత, ఆమె స్నేహితురాలు శిల్పా రెడ్డి రిషికేష్ వెళ్లారు. గంగానదిని సందర్శించడమే కాకుండా సామ్, శిల్పా హెలికాప్టర్‌లో చార్ ధామ్ యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 
 
శిల్పా రెడ్డి చార్ ధామ్ యాత్రకు సంబంధించి సమంత తో కలిసి ఉన్న తన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. "టేక్ ఆఫ్.. మొదట యమునోత్రికి" అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చింది. ఈ పిక్‌లో సమంత బ్రైట్ పర్పుల్ చుడిదార్‌లో అందంగా కనిపిస్తుండగా, శిల్పా శెట్టి వెస్ట్రన్ వేర్‌లో కనిపిస్తుంది.
 
కాగా అక్టోబర్ 2న సమంత, నాగ చైతన్య ఇద్దరూ కలిసి తమ విడాకుల విషయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత సోషల్ మీడియాలో వాళ్ళ విడాకులకు సంబంధించిన పుకార్లు షికార్లు చేయడం, సోషల్ మీడియాలో ఆమెపై నెగెటివ్ ప్రచారం చేయడంపై గట్టిగా స్పందించింది. 
 
నిన్న మూడు ఛానళ్ళపై పరువు నష్టం దావా వేసింది. మరోవైపు విడాకుల తరువాత తిరిగి నటన ప్రపంచంలో మునిగిపోవడానికి సిద్ధమైన సామ్ ఇటీవల తమిళ, తెలుగు ద్విభాషా చిత్రానికి సంతకం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments