హెలికాప్టర్‌లో చార్ ధామ్ యాత్రకు సమంత!

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (16:29 IST)
Samantha Akkineni
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల నుంచి చిన్న విరామం తీసుకుంటోంది. ఈ విరామ సమయంలో తనకు నచ్చిన ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎంజాయ్ చేస్తోంది. అక్టోబర్ 20న సమంత, ఆమె స్నేహితురాలు శిల్పా రెడ్డి రిషికేష్ వెళ్లారు. గంగానదిని సందర్శించడమే కాకుండా సామ్, శిల్పా హెలికాప్టర్‌లో చార్ ధామ్ యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 
 
శిల్పా రెడ్డి చార్ ధామ్ యాత్రకు సంబంధించి సమంత తో కలిసి ఉన్న తన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. "టేక్ ఆఫ్.. మొదట యమునోత్రికి" అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చింది. ఈ పిక్‌లో సమంత బ్రైట్ పర్పుల్ చుడిదార్‌లో అందంగా కనిపిస్తుండగా, శిల్పా శెట్టి వెస్ట్రన్ వేర్‌లో కనిపిస్తుంది.
 
కాగా అక్టోబర్ 2న సమంత, నాగ చైతన్య ఇద్దరూ కలిసి తమ విడాకుల విషయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత సోషల్ మీడియాలో వాళ్ళ విడాకులకు సంబంధించిన పుకార్లు షికార్లు చేయడం, సోషల్ మీడియాలో ఆమెపై నెగెటివ్ ప్రచారం చేయడంపై గట్టిగా స్పందించింది. 
 
నిన్న మూడు ఛానళ్ళపై పరువు నష్టం దావా వేసింది. మరోవైపు విడాకుల తరువాత తిరిగి నటన ప్రపంచంలో మునిగిపోవడానికి సిద్ధమైన సామ్ ఇటీవల తమిళ, తెలుగు ద్విభాషా చిత్రానికి సంతకం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments