Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీ కవిత గ్రీన్ ఛాలెంజ్.. మర్రి, గుల్మోహర్, వేప మొక్కల్ని నాటిన జక్కన్న

ఎంపీ కవిత ఛాలెంజ్‌ను దర్శకధీరుడు రాజమౌళి స్వీకరించారు. హరితహారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ మొక్కలు నాటాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ఈ ఛాలెంజ్‌ను రాజకీయ, సినీ ప్రముఖులు స్వీకరిస్తున్నారు. ఇ

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (19:05 IST)
ఎంపీ కవిత ఛాలెంజ్‌ను దర్శకధీరుడు రాజమౌళి స్వీకరించారు. హరితహారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ మొక్కలు నాటాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ఈ ఛాలెంజ్‌ను రాజకీయ, సినీ ప్రముఖులు స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా బాహుబలి మేకర్, ఎస్ఎస్ రాజమౌళి కూడా కవిత ఛాలెంజ్‌ను స్వీకరించారు.
 
మంగళవారం మర్రి, గుల్మోహర్, వేప మొక్కలని నాటి.. ఈ ఛాలెంజ్‌ని పుల్లెల గోపిచంద్, మంత్రి కేటీఆర్, డైరెక్టర్స్ సందీప్ వంగ, నాగ్ అశ్విన్‌లకి విసిరారు. ఇంకా తాను మొక్క నాటుతున్న ఫోటోని తన ట్విట్టర్‌లో రాజమౌళి పోస్టు చేశారు. 
 
ఇప్పటికే పలువురు సెలెబ్రిటీ కవిత ఛాలెంజ్‌ను స్వీకరించి.. తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి సెల్ఫీలు సోషల్ మీడియాలో పెడుతున్నారు.  ఫలితంగా కవిత గ్రీన్ ఛాలెంజ్‌కి మంది ఆదరణ లభిస్తోంది. ఇక రాజమౌళి ప్రస్తుతం తాను ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ట్రిపుల్ ఆర్ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ పనులలో బిజీగా ఉన్నారు. నవంబర్‌లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments