Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగధీర సీక్వెల్.. ఆర్ఆర్ఆర్ పూర్తి కాగానే..?

Webdunia
గురువారం, 1 జులై 2021 (12:15 IST)
మగధీర 2009లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని అల్లు అరవింద్ నిర్మాణంలో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ కథానాయకుడిగా నటించారు. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా. రామ్ చరణ్ కెరీర్‌లో రెండవ సినిమానే ఇంత పెద్ద హిట్ అవ్వడంతో రామ్ చరణ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. 
 
400 ఏళ్ల నాటి ప్రేమ కథను ఈ సినిమాలో చూపించి, ఆ కథను మళ్ళీ 21వ శతాబ్దానికి లింక్ చేయడం అప్పట్లో ఓ సంచలనం. అప్పటి వరకు మాస్ మరియు యాక్షన్ చిత్రాలను తేసే రాజమౌళి ఒక్కసారిగా సోసియో ఫాంటసీ చిత్రాల దర్శకుడిగా మారిపోయాడు. మగధీర తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు రాజమౌళి-రామ్ చరణ్ కలయికలలో ఆర్ఆర్ఆర్ వస్తుంది. ఎస్.ఎస్.రాజమౌళి మగధీర సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
 
రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆర్ఆర్ఆర్ పూర్తి అవగానే చరణ్ డైరెక్టర్ శంకర్ తో ఒక మూవీ చేస్తారని, ఎస్.ఎస్.రాజమౌళి మహేష్ బాబు తో కూడా ఒక మూవీ చేస్తారని ఇవి రెండు అయిపోగానే రాజమౌళి - రామ్ చరణ్ కలయికలో ముచ్చటగా మూడో సినిమాగా మగధీర 2 ఉంటుందని మాటలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments