Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చూపే బంగారమయ్యేనే శ్రీవల్లి' ... పుష్ప నుంచి మరో ఆడియో సాంగ్ రిలీజ్

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (11:22 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - కె.సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "పుష్ప". రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్. ఈ సినిమా నుంచి శ్రీ‌వ‌ల్లి పాట ప్రోమోను ఆ సినిమా యూనిట్ మంగళవారం రిలీజ్ చేయగా, బుధవారం ఆడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది. 
 
ఈ సినిమాలో రష్మిక మందన్నా శ్రీ‌వ‌ల్లిగా నటిస్తోంది. 'చూపే బంగారమయ్యేనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయేనే.. చూపే బంగారమయ్యేనే శ్రీవల్లి.. న‌వ్వే న‌వ‌ర‌త్న‌మాయెనే' అంటూ చంద్రబోస్ రాసిన లిరిక్స్ అల‌రిస్తున్నాయి.
 
ఈ సినిమా కోసం చంద్ర‌బోస్ రాసిన 'దాక్కో దాక్కో మేక' పాట‌కు కూడా మంచి స్పంద‌న వ‌చ్చిన విష‌యం తెలిసిందే. 'శ్రీ‌వ‌ల్లి' పాటని అక్టోబరు 13న ఉదయం 11.07కు విడుదల చేసింది. 
 
ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, సునీల్, రావు రమేశ్, అజయ్ ఘోష్, అనసూయ తదితరులు కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలోని మొదటి భాగం డిసెంబర్‌ 17వ తేదీన విడుదల కానున్న‌ట్లు ఆ సినిమా యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీకి రానున్న ఎనిమిది ఎయిర్ పోర్టులు.. ఎక్కడెక్కడో తెలుసా?

మందుల విషయంలో గొడవ.. తల్లిని హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: విదేశాల్లో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకో తెలుసా?

గల్ఫ్ పనిచేస్తూ రుణాలు తీసుకున్నారు.. కేరళకు 13మంది నర్సులు జంప్.. చివరికి?

కాకినాడలో ప్రేమజంట మృతి.. రైల్వే ట్రాక్ వద్ద ప్రేయసిని ప్రియుడు హత్య చేశాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments