Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చూపే బంగారమయ్యేనే శ్రీవల్లి' ... పుష్ప నుంచి మరో ఆడియో సాంగ్ రిలీజ్

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (11:22 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - కె.సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "పుష్ప". రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్. ఈ సినిమా నుంచి శ్రీ‌వ‌ల్లి పాట ప్రోమోను ఆ సినిమా యూనిట్ మంగళవారం రిలీజ్ చేయగా, బుధవారం ఆడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది. 
 
ఈ సినిమాలో రష్మిక మందన్నా శ్రీ‌వ‌ల్లిగా నటిస్తోంది. 'చూపే బంగారమయ్యేనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయేనే.. చూపే బంగారమయ్యేనే శ్రీవల్లి.. న‌వ్వే న‌వ‌ర‌త్న‌మాయెనే' అంటూ చంద్రబోస్ రాసిన లిరిక్స్ అల‌రిస్తున్నాయి.
 
ఈ సినిమా కోసం చంద్ర‌బోస్ రాసిన 'దాక్కో దాక్కో మేక' పాట‌కు కూడా మంచి స్పంద‌న వ‌చ్చిన విష‌యం తెలిసిందే. 'శ్రీ‌వ‌ల్లి' పాటని అక్టోబరు 13న ఉదయం 11.07కు విడుదల చేసింది. 
 
ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, సునీల్, రావు రమేశ్, అజయ్ ఘోష్, అనసూయ తదితరులు కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలోని మొదటి భాగం డిసెంబర్‌ 17వ తేదీన విడుదల కానున్న‌ట్లు ఆ సినిమా యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Raja Singh: గో హత్య నిర్మూలన కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలి: రాజా సింగ్ (video)

Peacok: తల్లి ప్రేమ- కొండచిలువతో నెమలి ఫైట్.. ఎందుకో తెలుసా? (video)

Revanth Reddy: ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న (video)

Bakrid 2025: దేశ వ్యాప్తంగా బక్రీద్‌ను జరుపుకుంటున్న ముస్లిం సోదరులు

Sonu Sood: తిరుమలలో చిరు వ్యాపారిని పలకరించిన సోనూ సూద్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments