శ్రీనివాస కళ్యాణం.. పెళ్లంటే పెద్ద పండుగ.. జీవితంలో ఒక్కసారే.. ట్రైలర్ సూపర్బ్

నితిన్, రాశీఖన్నా జంటగా నటించిన సినిమా శ్రీనివాస కళ్యాణం. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్స్‌కు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం సినీ యూనిట్ ట్విట్టర్ ద్వారా విడు

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (18:16 IST)
నితిన్, రాశీఖన్నా జంటగా నటించిన సినిమా శ్రీనివాస కళ్యాణం. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్స్‌కు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం సినీ యూనిట్ ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ట్రైలర్ మొత్తం కలర్‌ఫుల్‌గా వుంది. 
 
నిమిషం 54 సెకన్లున్న ఈ ట్రైలర్‌లో... మనవడు నాన్నమ్మను పెళ్లంటే ఏంటి అని అడుగగా.. పెళ్లంటే పేద్ద పండగ అని నటి జయసుధ వాయిస్ వినిపిస్తోంది. ఈ తర్వాత ఫోన్‌లో ఎవరు గర్ల్ ఫ్రెండా అని హీరో నితిన్‌ను అడుగుతుంది హీరోయిన్. కావాల్సింది తీసుకోవాలంటే మీ అమ్మాయిలను పొగడాలిగా అంటాడు నితిన్. లవ్‌ ఫీల్ వున్న డైలాగ్స్, తన ప్రేమను ప్రకాశ్ రాజ్ అయిన తండ్రితో చెప్పి ఒప్పించిన రాశీఖన్నా డైలాగ్స్ బాగున్నాయి. 
 
ఆపై పెళ్లంటే పెళ్లిలా జరగాలి.. ఫంక్షన్ లా కాదు. పెళ్లికి మన అనుకునేవాళ్లందరూ వస్తారు. వాళ్లను చూస్తుంటే డెబ్బై ఏళ్ల జీవితం గుర్తుకువస్తోందని జయసుధ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేస్తోందని.. సినీ పండితులు అంటున్నారు. కాగా శ్రీ వేంకటేశ్వరా బ్యానర్‌‍పై రూపొందిన ఈ మూవీ ఆగస్టు 9న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

బాబాయ్ హత్యే జగన్‌కు చిన్న విషయం, ఇక పరకామణి చోరీ ఓ లెక్కనా: సీఎం చంద్రబాబు

AI దుర్వినియోగం, పాకిస్తాన్ పార్లమెంట్ లోకి దూసుకొచ్చిన గాడిద, కిందపడ్డ సభ్యులు (video)

Bharat Future City: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు అంతా సిద్ధం

కార్మికులు ఢిల్లీ వెళ్లి కొట్లాడేందుకు రూ.10 లక్షలు ఇస్తా : మాజీ మంత్రి మల్లా రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments