Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొరిగే కుక్కలు ప్రతిచోటా ఉంటాయి.. అధైర్య పడకండి రోజాగారూ? శ్రీరెడ్డి

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (12:18 IST)
వివాదాస్పద నటి శ్రీరెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే రోజాపై పడింది. చిత్తూరులోని సుందరయ్య నగర్‌లో బోరు బావి ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే రోజాకు అక్కడి స్థానిక మహిళలు పూల స్వాగతం పలికారు. రోజా నడుస్తూ ఉంటే చాలా మంది మహిళలు ఆమె కాళ్లపై పూలు జల్లుతూ అభిమానాన్ని చూపించారు.

అయితే రోజా లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించారంటూ ఆమెపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ.. పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ తాట తీస్తానని రోజా గట్టి వార్నింగ్ ఇచ్చారు. 
 
మొత్తానికి ఈ ఇష్యూ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుండగా.. శ్రీరెడ్డి ప్రస్తుతం ఈ వివాదంపై స్పందించింది. "రోజా గారూ మీరు పేద ప్రజలకు మంచి మంచి పనులు చేస్తున్నారు. ధైర్యంగా ముందుకు వెళ్లండి మొరిగే కుక్కలు ప్రతిచోటా ఉంటాయి.. అధైర్య పడకండి.. మీరు ఒంటరి కాదు. మీకు సపోర్ట్‌గా మేం ఉన్నాం'' అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి.

కానీ గతంలో రోజాపై కూడా శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓ నటి భర్తతో రోజాకి ఏవో పాత వ్యవహారాలు ఉన్నాయంటూ అప్పట్లో ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టి అగ్గిరాజేసిన సంగతి విదితమే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mahanadu: కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది: చంద్రబాబు

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు (Video)

కొత్త పార్టీ కథ లేదు.. బీఆర్ఎస్‌ను బీజేపీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్: కవిత

షోపియన్‌ తోటలో నక్కి వున్న ఇద్దరు లష్కర్ హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

వల్లభనేని వంశీకి మళ్లీ రిమాండ్ పొడగింపు - కస్టడీ పిటిషన్ కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments