Webdunia - Bharat's app for daily news and videos

Install App

"లైగర్"పై శ్రీరెడ్డి ఏం చెప్పింది.. మైక్ టైసన్ అంత తీసుకున్నాడా?

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (17:26 IST)
లైగర్ సినిమా కలెక్షన్ల పరంగా రాణించలేకపోయింది. దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'లైగర్'  సినిమాను దాదాపు రూ. 90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారని చెపుతున్నారు. దీంతో, కలెక్షన్ల పరంగా చూస్తే ఈ సినిమా భారీ నష్టాలనే మిగిల్చినట్టయింది. 
 
మరోవైపు ఈ సినిమాలో నటించిన ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ మాజీ ఛాంపియన్ మైక్ టైసన్‌కు భారీ రెమ్యునరేషన్ ఇచ్చారట. టైసన్ ఏకంగా రూ.23 కోట్లు తీసుకున్నాడని ఓ వార్త వైరల్ అవుతోంది. అంటే మొత్తం పెట్టుబడిలో టైసన్ ఖర్చే ఎక్కువని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.
 
ఇకపోతే.. తాజాగా నటి శ్రీరెడ్డి లైగర్ సినిమాపై స్పందించింది. ఈ సినిమాలో అసలు కంటెంటే లేదని... కంటెంట్ లేని సినిమాకు ఇంత హైప్ అవసరమా? అని ఎద్దేవా చేసింది. 
 
అలాగే దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై శ్రీరెడ్డి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తీసేవన్నీ ఫ్లాప్ సినిమాలేనని... అయినా, మహేశ్ బాబు డేట్స్ ఇవ్వడం లేదని చెప్పడం ఏంటో అని విమర్శించింది. మహేశ్ డేట్స్ ఇవ్వలేదని ఏడవడం ఎంతవరకు కరెక్ట్ అని శ్రీరెడ్డి ప్రశ్నించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ మంత్రి అనిల్ కుమార్ దూషణల పర్వం - పోలీసుల నోటీసు జారీ

బీటెక్ ఫస్టియర్ విద్యార్థితో మహిళా టెక్నీషియన్ ప్రేమాయణం

రష్యాలో కుప్పకూలిన విమానం... 49 మంది దుర్మరణం

గాలిలో నుంచి నేరుగా హైవేపై కూలిన విమానం, ఇద్దరు మృతి (video)

భర్తపై కోపం.. నాలుకను కొరికి నమిలి మింగేసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments