Publish Date: Thu, 01 Sep 2022 (12:30 IST)
Updated Date: Thu, 01 Sep 2022 (12:37 IST)
టాలీవుడ్లో ఒకప్పుడు గ్లామరస్ పాత్రల్లో కనిపించి.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రమ్యకృష్ణ.. మదర్ రోల్స్ చేస్తూ మరోసారి తన సత్తా చాటుతున్నారు.
అయితే తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు రమ్యకృష్ణ . తనకు బాలీవుడ్లు ఏమాత్రం అచ్చి రావంటూ.. కుండ బద్దలు కొట్టారు. ఆ కామెంట్స్తో నెట్టింట వైరల్ అవుతున్నారు.
రీసెంట్గా ఓ ఇంటర్య్యూలో మాట్లాడిన రమ్యకృష్ణ .. తను బాలీవుడ్లు చేయడంపై కామెంట్ చేశారు. బాలీవుడ్లు తనకు అచ్చిరావని నిక్కచ్చిగా చెప్పారు. గతంలో కూడా బాలీవుడ్ల్లో… క్రేజీ ప్రాజెక్ట్స్లో పని చేసినప్పటికీ.. ఒక్కటీ కూడా తన సూపర్ హిట్ను ఇవ్వలేకపోయాయన్నారు.
ఇక లైగర్ విషయానికి వస్తే.. రమ్య తన ట్రూ పర్ఫార్మెన్స్తో మరోసారి అందర్నీ ఆకట్టుకున్నారు. మాస్ మదర్గా తన నటనతో మరోసారి అందరిని కట్టిపడేశారు రమ్యకృష్ణ. బాలీవుడ్లోనూ ఛాన్స్లు పట్టేస్తూ.. గ్లోబల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోతున్నారు.
సెల్వి
Publish Date: Thu, 01 Sep 2022 (12:30 IST)
Updated Date: Thu, 01 Sep 2022 (12:37 IST)