విజయ్ దేవరకొండ ఉదారత : పారితోషికంలో అభిమానులకు రూ.కోటి

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (08:19 IST)
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఉదారత చాటుకున్నాడు. ఖుషి చిత్రం తాను తీసుకున్న పారితోషికంలో కోటి రూపాయలను తన అభిమాన కుటుంబాలకు ఇవ్వనున్నట్టు తెలిపారు. మొత్తం వంద కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమానికి మంగళవారం నుంచే శ్రీకారం చుడుతానని చెప్పారు. ఆ వంద కుటుంబాలను ఎంపిక చేసి ఖుషి సక్సెస్ మీట్‌లో డబ్బును అందజేస్తానని సోమవారం వైజాగ్‌లో జరిగిన సక్సెస్ మీట్‌లో వెల్లడించారు. 
 
విజయ్‌ దేవకొండ, సమంత జంటగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రమిది. సెప్టెంబరు 1 విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా విజయ్‌, శివ నిర్వాణ, సంగీత దర్శకుడు హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ తదితరులు సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ఇందులో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, 'నా మీద, మా సినిమాపైన సోషల్‌ మీడియాలో దాడులు జరుగుతున్నాయి. కొందరు డబ్బులిచ్చి మరీ మా సినిమాపై నెగెటివిటీ తీసుకొస్తున్నారు. 
 
ఎన్నో ఫేక్‌ రేటింగ్స్‌, యూట్యూబ్‌ ఫేక్‌ రివ్యూలనూ దాటుకుని సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతుందంటే కారణం మీ (అభిమానులు) ప్రేమే. మీరిచ్చే ఈ ఎనర్జీ చూస్తుంటే ఇప్పుడు దాని గురించి మాట్లాడాలనిపించడంలేదు. ఆ సంగతి మరో రోజు చూసుకుందాం. ఈ సినిమా విషయంలో మీ ముఖాల్లో నవ్వులు చూడాలనుకునే నా కోరిక నెరవేరింది. అందుకు చాలా ఆనందంగా ఉంది. డబ్బు సంపాదించాలి, అమ్మ, నాన్నలను హ్యాపీగా ఉంచాలి, సమాజంలో గౌరవం కావాలి.. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే నేనెప్పుడూ పనిచేస్తుంటా. 
 
కానీ, ఇప్పటి నుంచి మీకోసం పనిచేయాలనుకుంటున్నా. మీరూ ఆనందంగా ఉండాలి. వ్యక్తిగతంగా ఒక్కొక్కరినీ కలిసి 'ఖుషి'ని సెలబ్రేట్‌ చేసుకోవాలని ఉందిగానీ అది వీలుపడదు. అందుకే వంద కుటుంబాలను ఎంపిక చేసి నా సంపాదన నుంచి రూ.కోటిని (ఒక్కో ఫ్యామిలీకి రూ.లక్ష) వారికి పది రోజుల్లో అందిస్తా. మనమంతా దేవర ఫ్యామిలీ. నా ఆనందం, సంపాదనను మీతో పంచుకోకపోతే వేస్ట్‌. నేను అనుకున్న ఈ పని పూర్తయినప్పుడు 'ఖుషి' విషయంలో తృప్తిగా ఉంటా. వివరాలు కోసం సంబంధిత ఫామ్స్‌ని సోషల్‌ మీడియాలో మంగళవారం పోస్ట్‌ చేస్తాం' అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం: మృతుల కుటుంబానికి రూ.5లక్షలు ప్రకటించిన తెలంగాణ

Drum: భార్యను చంపి మృతదేహాన్ని డ్రమ్‌లో నింపి పూడ్చిపెట్టేశాడు..

స్థానిక సంస్థల్లో పోటీ- ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ

విద్యార్థులకు శుభవార్త చెప్పిన టి విద్యాశాఖ.. ఫీజుల చెల్లింపులపై క్లారిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments