Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నను చూశాను.. అమ్మ ఎలా ఉందంటూ సైగతో అడిగారు.. హ్యాపీగా ఉన్నా : ఎస్పీ చరణ్

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (18:21 IST)
కరోనా వైరస్ బారినపడి జీవనపోరాటం చేస్తున్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి.బాలుసబ్రహ్మణ్యం ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ప్రత్యేక ఐసీయూ వార్డులో ఎక్మో సపోర్టుతో ఉన్నారు. అయితే, ఆయన ఆరోగ్యం విషమంగా మారిన విషయం తెల్సిందే. అయినప్పటికీ ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తుండగా, ఆయన ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. 
 
ఈ క్రమంలో తన తండ్రి ఆరోగ్యంపై ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ చాలా రోజుల తర్వాత సంతోషం వెలిబుచ్చారు. రెండు వారాల తర్వాత తన తండ్రిని చూశానని హర్షం వ్యక్తం చేశారు. 'నాన్న నన్ను చూసి గుర్తుపట్టారు. కొద్దిగా మాట్లాడారు. ఎలావున్నారు? అని అడిగితే బొటనవేలు పైకెత్తి చూపించారు. అందరూ చేస్తున్న ప్రార్థనల గురించి వివరించాను. 
 
ఆ తర్వాత నేను ఎలా ఉన్నానని అడిగారు. అమ్మ ఎలా ఉందంటూ సైగల ద్వారా అడిగారు. చాలారోజుల తర్వాత నాన్నను చూడడం సంతోషం కలిగిస్తోంది. నన్ను చూసి ఆయన కూడా సంతోషించి ఉంటారని భావిస్తున్నాను. ఇకపై తరచుగా వెళ్లి నాన్నను కలుస్తాను. నాన్న కచ్చితంగా కోలుకుని తిరిగి వస్తారు' అంటూ ఎస్పీ చరణ్ వీడియో సందేశంలో తెలిపారు. తన తండ్రి చికిత్సకు బాగానే స్పందిస్తున్నారని అయితే రోజులో అధికశాతం మత్తులోనే ఉంటున్నారని వెల్లడించారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#SPB health update

A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) on

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments