Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పెళ్లిపీటలపై కూర్చోనున్న రజనీ కుమార్తె సౌందర్య

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (09:31 IST)
సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రెండో పెళ్లి చేసుకోనుంది. గతంలో నగరానికి చెందిన యువ పారిశ్రామికవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఇపుడు మళ్లీ రెండో పెళ్లి చేసుకోనుంది. కోయంబత్తూరుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త కుమారుడుతో ఆమె పెళ్లి జరుగనుంది. ఈ వివాహం మాత్రం ఇరు కుటుంబాల మధ్యే నిర్వహించనున్నారు. ఇప్పటికే నిశ్చితార్థం ముగియగా, పెళ్లి మాత్రం వచ్చే నెలలో జరుగనుంది. 
 
ఇదిలావుంటే, సౌందర్య తన తల్లి లతా రజినీకాంత్‌తో కలిసి మంగళవారం తిరుపతికి వెళ్లి శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. వీరివెంట ఇరు కుటుంబాల సభ్యులతో పాటు మొత్తం 20 మంది వరకు వెళ్లారు. 
 
వీరంతా సోమవారం రాత్రికే పద్మావతి అతిథి గృహంలో బస చేసి మంగళవారం వేకువజామున స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు వివాహ పత్రికను వేంకటేశ్వరుని పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments