సోనూసూద్‌తో నటించే ఛాన్స్ కొట్టేసిన బాలిక.. చెర్రీతో డిష్యూం

Webdunia
శనివారం, 10 జులై 2021 (15:54 IST)
మణికొండకు చెందిన బాలికకు నటుడు సోనూసూద్‌తో కలిసి నటించే అవకాశం లభించింది. సోనూసూద్‌ ఓ స్పోర్ట్స్‌ యాడ్‌ సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం సికింద్రాబాద్‌ ఆర్‌ఆర్‌సీ బ్యాడ్మింటన్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న కె. సమీక్షారెడ్డి (12)ని ఎంపిక చేసుకున్నారు.

ఆమె బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా, కోచ్‌గా సోనూ ఆ యాడ్‌లో కనిపించనున్నారు. ఎల్బీస్టేడియంలో ఇందుకోసం శుక్రవారం షూటింగ్‌ నిర్వహించారు. ఈ యాడ్‌ ద్వారా వచ్చే డబ్బులో కొంత సోనుసూద్‌ చారిటీకి, మరికొంత ఆర్‌ఆర్‌సీలో శిక్షణ పొందే పేద క్రీడాకారులకు ఇవ్వనున్నట్లు బాలిక తండ్రి మధుసూదన్‌రెడ్డి తెలిపారు.
 
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ 'ఆచార్య' సినిమాను రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది.

కరోనా కారణంగా కొన్ని రోజుల క్రితం ఆగిపోయిన షూటింగు రీసెంట్ గా మొదలైంది. చిరంజీవి-చరణ్ సోనూసూద్ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం చరణ్ - సోనూసూద్‌పై 'కుస్తీ పోటీ'కి సంబంధించిన ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారట. సినిమాలో ఒకానొక కీలకమైన సందర్భంలో వచ్చే ఈ ఎపిసోడ్‌ను కొరటాల చాలా కొత్తగా డిజైన్ చేశాడనీ, చాలా ఇంట్రెస్టింగ్ ‌గా ఉంటుందని అంటున్నారు.
 
ఈ సినిమాలో 'సిద్ధా' అనే పవర్ఫుల్ నక్సలైట్ పాత్రలో చరణ్ కనిపించనున్నాడు. ప్రతినాయకుడి పాత్రలో సోనూ సూద్ నటిస్తున్నాడు. సోనూసూద్ కెరియర్లోనే ఈ పాత్ర ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని అంటున్నారు. ఇక చరణ్ .. మరికొంతమంది ఫైటర్లపై చిత్రీకరించిన రెయిన్ ఫైట్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలవనుందనే టాక్ ఆల్రెడీ బయటికి వచ్చింది. చిరంజీవి సరసన కాజల్ అలరించనుండగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే కనువిందు చేయనుంది. ఈ నెలాఖరుకు షూటింగు పార్టును పూర్తిచేసుకుని, దసరాకి విడుదల కానుందని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు

తర్వాతి కథనం
Show comments