Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూ సూద్ కొత్త అవతారం.. ఏంటంటే?

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (11:48 IST)
బాలీవుడ్ హీరో సోనూ సూద్ కొత్త అవతారం ఎత్తారు. కరోనా కష్టకాలంలో దేవుడుగా మారాడు సోనూ సూద్. వలస కూలీలను తమ ఇళ్ల స్థలాలకు చేర్చి, అలాగే పలు విధాలుగా నష్టపోయిన వారికి ఆసరాగా ఉంటూ వాళ్ళని ఆదుకుంటూ రియల్ హీరో అయ్యాడు. ఇంకా పేద వాళ్లకి సహాయం చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. విలన్ క్యారెక్టర్లు చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. 
 
ముఖ్యంగా అరుంధతి సినిమాలో ఇతను పోషించిన పశుపతి పాత్ర అయితే ఇప్పటికి ఎవరు మరిచిపోలేరు. అయితే ఈ మధ్యకాలంలో సోనూకి అవకాశాలు తగ్గాయి. ఇప్పుడు మరోసారి సోనూని తీసుకురావాలని నిర్మాతలు అనుకుంటున్నారు.
 
ప్రస్తుతం సోనూసూద్.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా సోనూసూద్‌ తన భవిష్యత్తు కెరీర్‌పై కీలక ప్రకటన చేశాడు. తాను త్వరలోనే సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టనున్నట్లు పేర్కొన్నాడు సోనూ. 
 
"నేనే నిర్మాతగా మారబోతున్నా. చర్చలు చివరి దశలో ఉన్నాయి. ప్రజల్లో స్ఫూర్తి నింపే కథలు, నేను చేయాలనుకున్న స్క్రిఫ్ట్స్ కోసం చూస్తున్నా. అన్నీ కుదిరితే నటుడిగా, నిర్మాతగా మీ ముందుకొస్తా" అని స్వయంగా సోనూ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ నేతను కత్తితో పొడిచి.. శవాన్ని ముక్కలు నరికి....

Pawan Kalyan: శర్మిష్ట పనోలి అరెస్ట్.. స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదనీ యువకుడు బలవన్మరణం...

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments