Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై కేసు నమోదు

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (14:54 IST)
పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారిన అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. తాజాగా ఆయన నటించిన ఓ యాడ్ వివాదాస్పదం కావడంతో ఈ కేసు నమోదైంది. గతంలో రాపిడో సంస్థ బన్నీతో చేయించిన ప్రకటన చేయించింది. ఇది కూడా వివాదమైంది. 
 
సిటీ బస్సుల గురించి యాడ్‌లో చూపించడంపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అప్పట్లో ఫైర్ అయ్యారు. ఆ యాడ్ తొలగించకపోతే అల్లు అర్జున్, రాపిడో సంస్థపై కేసు వేస్తామని హెచ్చరించారు. దెబ్బకు దిగి వచ్చిన రాపిడో యాజమాన్యం అందులో సిటీ బస్సుల గురించి తీసిన షాట్ తొలగించింది.
 
ఆ తర్వాత బన్నీ యాక్ట్ చేసిన జొమాటో యాడ్ కూడా వివాదానికి దారి తీసింది. ఈ యాడ్‌లో నటుడు సుబ్బరాజును బన్నీ కొట్టగా.. ఆ దెబ్బకు సుబ్బరాజు గాల్లో తేలిపోతాడు. ఇదికూడా వివాదాస్పదమైంది. 
 
ఇపుడు శ్రీ చైతన్య విద్యాసంస్థల కోసం ఓ యాడ్ చేశాడు. ఆ ప్రకటనపై ప్రస్తుతం వివాదం నెలకొంది. కొత్త ఉపేందర్‌ రెడ్డి అనే సామాజిక కార్యకర్త అల్లు అర్జున్‌పై హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
బన్నీ నటించిన శ్రీ చైతన్య విద్యాసంస్థల వ్యాపార ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందని అన్నారు. ఐఐటీ, ఎన్ఐటీ ర్యాంకుల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఆయన బన్నీతో పాటు శ్రీ చైతన్య విద్యాసంస్థలపై కేసు పెట్టారు. తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments