Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడిని మూసేయండి అంటున్న సీతా కళ్యాణ వైభోగమే టీజర్‌- మంత్రి కోమటి రెడ్డి ఆవిష్కరణ

డీవీ
శనివారం, 20 ఏప్రియల్ 2024 (07:28 IST)
Sita Kalyana vaibhogame team with Minister Komati Reddy
సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్రయూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు పెంచేసింది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి చేతుల మీదుగా విడుదల చేయించారు.
 
నల్ల నల్ల నీళ్లలోనా తెల్లని చేప అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో పాట.. హీరో హీరోయిన్లు పరిచయం, గ్రామీణ వాతావరణం, ఊరు అందాలను ఓపెన్ చేస్తూ టీజర్‌ను ప్రారంభించారు.  ఆ వెంటనే గోవాకు లొకేషన్ మార్చేశారు. అటుపై యాక్షన్ సీక్వెన్స్‌ను, గగన్ విహారి విలనిజాన్ని చూపించారు. ‘నా పెళ్లాం లేచిపోయింది.. సీత నాది’ అంటూ విలన్ చెప్పిన డైలాగ్స్, చేజింగ్, యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. 
 
‘సీతమ్మ లేని గుడి రాముడి గుడే కాదు.. గుడిని మూసేయండి’ అని చెప్పే డైలాగ్.. ఆ తరువాత చూపించిన యాక్షన్ సీక్వెన్స్, హీరో వీరోచిత పోరాటాలు అదిరిపోయాయి. ‘సీత ఎప్పటికీ రాముడిదే’ అంటూ టీజర్ చివర్లో హీరో చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ టీజర్‌ను రిలీజ్ చేసిన అనంతరం మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ‘టీజర్ చాలా బాగుంది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాల’ని కోరుకున్నారు.
 
ఈ టీజర్‌లో చరణ్ అర్జున్ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. ఇక కెమెరామెన్ పరుశురామ్ సహజమైన లొకేషన్లలో, ఎంతో సహజంగా సినిమాను తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. అన్ని అంశాలు జోడించి తీసిన ఈ మూవీ కుటుంబ సమేతంగా చూసేలా ఉంది. ఏప్రిల్  26న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments