Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగర్ సునీత గురువు కన్నుమూత.. భావోద్వేగ ట్వీట్..

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (13:04 IST)
సింగర్ సునీత ఇటీవల రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఒక మీడియా హౌజ్‌ని చెందిన రామ్ వీరపనేనిని జనవరిలో పెళ్లాడారు సునీత. అప్పటి నుంచి మరింత బిజీగా మారిపోయారు ఈ సింగర్. ఒక వైపు సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూనే మరోవైపు ఇటీవల బిజినెస్ రంగంలోకి అడుగెట్టారు సునీత.
 
తన అద్భుత గాత్రంతో ఎన్నో వేల పాటలకు ప్రాణం పోశారు. ముఖ్యంగా మెలోడీలు పాడటంలో దిట్ట అయిన సునీత.. మెలోడీ క్వీన్‌గా బిరుదును సంపాదించుకున్నారు.
 
మరోవైపు యాంకర్‌గా, జడ్జిగా బుల్లితెరపై మంచి పేరును సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సింగర్‌కి చిన్నప్పుడు సరిగమలు చెప్పిన గురువు తాజాగా కన్నుమూశారు. దీంతో ఈ సింగర్‌ భావోద్వేగానికి లోనయ్యారు. తనకు చిన్ననాటి గురువును గుర్తు చేసుకుంటూ సునీత తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
 
''శ్రీ పెమ్మరాజు సూర్యారావు గారు . చిన్నప్పుడు నాకు సరిగమల భిక్ష పెట్టిన నా గురువు. స్వర్గస్థులయ్యారు. చాలా బాధగా ఉంది. ఇలాంటి మహానీయుల్ని కోల్పోతుంటే'' అని సునీత ఓ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఫొటోను కూడా ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఇక సునీత పోస్ట్‌కి స్పందిస్తోన్న నెటిజన్లు..ఆయన ఆత్మకు శాంతి కలగాలని కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడిలో భార్య కాళ్లకు భర్త నమస్కారం, బుద్ధిలేదా అంటూ బామ్మ ఆగ్రహం (video)

ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఇంట్లో వ్యక్తిగత సహాయకుడు ఆత్మహత్య, అదే కారణమా?

Thalliki Vandanam: తల్లికి వందనం స్కీమ్.. తండ్రీకొడుకుల అనుబంధం.. వీడియో వైరల్

15 ఏళ్ల తర్వాత కలిశాం.. ఇంతలో ఆ నలుగురు మృతి.. డీఎన్ఏ కోసం వేచి చూస్తున్నాం

భార్య చివరి కోరికను తీర్చాడు.. కానీ తిరిగి రాని లోకాలకు చేరాడు.. ఇద్దరు కుమార్తెలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments