Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు పట్టాలపై నేపథ్య గాయని హరిణి తండ్రి మృతదేహం

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (13:29 IST)
ప్రముఖ సినీ నేపథ్యగాయని హరిణి తండ్రి ఏకే రావు బెంగుళూరు రైలు పట్టాలపై శవమై కనిపించారు. ఆయన మృతదేహాన్ని బెంగుళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ నేపథ్యగాయని హరిణికి ఇతర భాషల కంటే కన్నడలో మచి పేరుంది. అయితే, వారం రోజుల క్రితం ఈమె కుటుంబం అదృశ్యమైంది. ఈ మేరకు బెంగుళూరు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పోలీస్ కేసు నమోదైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తూ వస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో హరిణి తండ్రి మృతదేహాన్ని రైలు పట్టాలపై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈయన ప్రమాదవశాత్తు పడి చనిపోయారా లేక ఎవరైనా హత్య చేసి చంపేశారా? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
 
కాగా, ఏకే రావు తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి పదవీ విరమణ పొందిన ఆయన... సుజనా ఫౌండేషన్‌కు సీఈవోగా పని చేస్తున్నారు. ఈ కార్యాలయానికి వారం రోజుల నుంచి హాజరుకాలేదని కార్యాలయ సిబ్బంది సమాచారం చేరవేశారు. ఈ నేపథ్యంలో ఆయన మృతదేహాన్ని బెంగుళూరు రైలు పట్టాలపై గుర్తించడం ఇపుడు కలకలం రేపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెడలో రెండు పుస్తెల బంగారు తాడు కోసం మహిళ గొంతు కోసి హత్య

Visakhapatnam: విశాఖపట్నంలో మెట్రో రైలు సేవలు... ప్రారంభానికి ఏపీ సన్నాహాలు

Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?

ఆపరేషన్ సిందూర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసులు 1500 కి.మీ పయనించి లా విద్యార్థిని అరెస్ట్

ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా కలకలం- ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments