Webdunia - Bharat's app for daily news and videos

Install App

శింబు 'ఈశ్వరన్‌'లోని మాంగల్యం పాట వైరల్

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (20:09 IST)
simbu
కోలీవుడ్‌ మోస్ట్‌ బ్యాచిలర్‌ హీరో శింబు 'ఈశ్వరన్‌' చిత్రంలోని 'మాంగల్యం' అనే పాట యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ యేడాది సంక్రాంతికి శింబు నటించిన 'ఈశ్వరన్‌' చిత్రం విడుదలైంది. సుశీంద్రన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం షూటింగు కేవలం నెల రోజుల్లోనే పూర్తి చేశారు. 
 
దీనికి కారణం హీరో శింబు సహకారమే అంటూ దర్శకుడు సుశీంద్రన్‌ సహా ఇందులో ఓ కీలక పాత్ర పోషించిన సీనియర్‌ దర్శకుడు భారతీరాజా ఈ మూవీ ఆడియో రిలీజ్‌ వేడుకల్లో చెప్పారు. అలాగే, వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో 'మానాడు'లో నటించారు.
 
ఈ చిత్రాన్ని కూడా శింబు నిర్ణీత షెడ్యూల్‌లోనే పూర్తి చేసి ప్రతి ఒక్కరినీ అబ్బురపరిచారు. ప్రస్తుతం స్టార్‌ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వంలో 'వెందు తణిందదు కాడు' అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే, నిర్మాతలకు సరైన సహకారం అందించని వ్యవహారం తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి వద్ద పంచా యితీ జరిగింది. 
 
దీనికి శింబు తల్లి ఉషా రాజేందర్‌ తాజాగా హాజరై వివరణ ఇచ్చారు. ఇదిలావుండగా 'మాంగల్యం' పాటను ఇప్పటికే 150 మిలియన్ల మంది వీక్షించారు. గతంతో శింబు నటించిన ఏ చిత్రంలోని పాట ఈ రేంజ్‌లో ఆదరణ పొందిన దాఖలా లేకపోవడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కూటమి ప్రభుత్వంపై నమ్మకం లేక వరద బాధితులకు కోటి రూపాయలు నేనే ఖర్చు పెట్టా: బొత్స

దేశంలోనే తొలి అర్బన్ రోప్ వే సేవలు.. వ్యయం రూ.807 కోట్లు!!

హిందువులు నడిపే మాంసపు షాపులకు ప్రత్యేకంగా సర్టిఫికేషన్... ఎక్కడ?

కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి షాక్ : 25 వరకు జైల్లోనే...

ఔటర్ రింగ్ రోడ్డు టు ఇబ్రహీంపట్నం, ప్రేమజంటల రాసలీలలు, దోపిడీ దొంగతనాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

తర్వాతి కథనం
Show comments