Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడిపోయాక మమ్మీడాడీ బాగున్నారు : శృతిహాసన్

Webdunia
మంగళవారం, 25 మే 2021 (17:09 IST)
విశ్వనటుడు కమల్ హాసన్. ఈయన మొదటి భార్య సారిక. వీరికి శృతిహాసన్, అక్షర హాసన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కమల్ హాసన్ - సారికలు విడిపోయి చాలా కాలమైంది. కమల్ హాసన్ హీరోయిన్ గౌతమితో కొంతకాలం సహజీవనం చేశారు. వీరిద్దరు కూడా విడిపోయారు. 
 
అయితే, శృతిహాసన్, అక్షర హాసన్‌లు సినీ రంగంలోకి అడుగుపెట్టి హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. తాజాగా కమల్, సారికల కూతురు శ్రుతి హాసన్ అమ్మానాన్నల విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. వారు విడిపోవడంపై ‘హర్షం’ వ్యక్తం చేసింది. అదేమిటి అంటే గమ్మత్తుగా సమాధానమిచ్చింది. 
 
'అమ్మానాన్న విడిపోయినప్పుడు నేను చిన్నదాన్ని. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. కలిసున్నప్పటి కంటే విడిపోయిన తర్వాతే వారు సంతోషంగా ఉన్నారు. ఒకరంటే ఒకరికి ఏమాత్రం పడనివారు బలవంతంగా కలిసి ఉండడం అంత మంచి విషయం ఏమీ కాదు' అని చెప్పుకొచ్చింది. 
 
వివాహ బంధం నుంచి విడిపోయినా పిల్లలకు మాత్రం చక్కని తల్లిదండ్రులుగా కొనసాగారని వివరించింది. ఇప్పుడు అమ్మా బాగుంది.. నాన్నా బాగున్నాడని పేర్కొంది. విడిపోయినా తమతమ ప్రత్యేకతతో సంతోషంగా జీవిస్తున్నారని చెప్పింది. కమల్ మొదటి వివాహం భరతనాట్య నర్తకి వాణీ గణపతితో జరిగింది. పదేళ్ల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments