Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవించి అడ్డంగా బుక్కైన ఎస్ఎస్.రాజమౌళి కుమారుడు?

మద్యం సేవించి వాహనం నడపొద్దని పదేపదే ట్రాఫిక్ పోలీసులు హితవు పలుకుతున్నారు. అయినప్పటికీ.. పోలీసులు హితవచనాలను ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. పూటుగా తాగేసి బండి లేదంటే కారు నడుపుతూ పోలీసులకు దొరికేస్తుంట

Webdunia
ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (17:45 IST)
మద్యం సేవించి వాహనం నడపొద్దని పదేపదే ట్రాఫిక్ పోలీసులు హితవు పలుకుతున్నారు. అయినప్పటికీ.. పోలీసులు హితవచనాలను ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. పూటుగా తాగేసి బండి లేదంటే కారు నడుపుతూ పోలీసులకు దొరికేస్తుంటారు. సెలెబ్రిటీలూ అందుకు మినహాయింపేమీ కాదు. ఇంతకుముందు చాలా మంది స్టార్లు అలా దొరికారు కూడా. 
 
తాజాగా ఓ టాప్ డైరెక్టర్ కుమారుడు కూడా తాగుతూ.. వాహనం నడిపి పోలీసులకు దొరికిపోయాడట. ఆ టాప్ డైరెక్టర్ ఎవరో కాదు.. బాహుబలి లాంటి ప్రపంచ స్థాయి సినిమా తీసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. తాగి వాహనం నడిపి దొరికిపోయింది అతడి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ. నమ్మబుద్ధి కావడం లేదు కదా. కానీ, ఆ విషయాన్ని చెప్పింది.. స్వయానా కార్తికేయ. షో టైమ్ ఆడియో లాంచ్ సందర్భంగా ఆ విషయాలను వెల్లడించాడు. 
 
‘‘ఒక సారి నేను డ్రంకెన్ డ్రైవ్‌లో పోలీసులకు దొరికపోయాను. అది కూడా తాగుతూ కారు నడిపాను. అది నేరమన్న సంగతి అప్పటికీ నాకింకా తెలియదు. ఎందుకంటే.. వాళ్లు తాగి నడపొద్దన్నారు కానీ.. తాగుతూ నడపొద్దనలేదు కదా. అందుకే.. నేను అప్పటికే కొంత మద్యం సేవించినా.. మళ్లీ మద్యం సేవిస్తూనే కారు నడిపాను. దీంతో పోలీసులు నన్ను ఆపారు. అప్పుడు తెలిసింది.. అది కూడా నేరమేనన్న సంగతి’’ అని తాను చేసిన తప్పును సభాముఖంగా కార్తికేయ ఒప్పేసుకున్నాడు. 

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments