అభినయ 'దొరసాని' ... "పంచతంత్రం" చిత్రంలో ప్రధాన పాత్రలో..

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (12:19 IST)
సీనియర్ నటి జీవితా రాజశేఖర్ కుమార్తెల్లో ఒకరు శివాత్మిక రాజశేఖర్. దొరసాని చిత్రం ద్వారా వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ చిత్రంలో అందం, అమాయకత్వం కలబోసిన నాయికగా యువతరం హృదయాల్ని దోచుకుంది. 
 
ప్రస్తుతం ఆమెకు తెలుగుతో పాటు తమిళంలో కూడా కొత్త చిత్రాల అవకాశాలు వరిస్తున్నాయి. తాజాగా ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, రాహుల్‌ విజయ్‌, నరేష్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 
 
హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. గురువారం కథానాయిక శివాత్మిక జన్మదినం. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ఆమె ఫస్ట్‌లుక్‌ను అడివి శేష్‌ విడుదల చేశారు. 
 
ఆ తర్వాత చిత్ర కథ గురించి మాట్లాడుతూ, 'ప్రతి ఒక్కరి జీవితాన్ని నిర్దేశించే పంచేంద్రియాల చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఐదు ఇంద్రియాల నుంచి వ్యక్తమయ్యే భావోద్వేగాలతో సాగుతుంది. నేటి యువతరం ఆలోచనలు, దృక్పథాలకు అద్దం పడుతుంది. ఈ సినిమాలో లేఖ పాత్రలో శివాత్మిక కనిపిస్తుంది. అభినయానికి ఎంతో ఆస్కారమున్న పాత్ర అమెది' అని వ్యాఖ్యానించారు. 
 
అలాగే, శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ, లేఖ పాత్ర తనకెంతో ప్రత్యేకమని శివాత్మిక చెప్పింది. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించే చిత్రమిదని నిర్మాతలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

భర్త చిత్రహింసలు భరించలేక పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్యలు... ఎక్కడ?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం- వరద నీటి తొలగింపుకు రూ.27 కోట్లు కేటాయింపు

దుబాయ్ ఎయిర్‌ షో - తేజస్ యుద్ధ విమానం ఎలా కూలిందో చూడండి....

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments